గీసుగొండ, డిసెంబర్ 1: శాంతిభద్రతల పరిరక్షణకే కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్లు మామునూరు ఏసీపీ నరేశ్కుమార్ అన్నారు. 16వ డివిజన్ జాన్పాకలో గురువారం రాత్రి కార్డన్ సెర్చ్ నిర్వహించారు. మామునూరు సబ్ డివిజన్ పరిధిలోని గీసుగొండ, పర్వతగిరి, మామునూరు, సంగెం, ఐనవోలు పోలీస్స్టేషన్లలో పని చేస్తున్న సీఐలు, ఎస్సైలు, కానిస్టేబుళ్లు గ్రామంలో ఇంటింటా సోదాలు చేశారు.
బెల్టుషాపుల్లో రూ. 14,140 విలువైన మద్యం, సరైన పత్రాలు లేని 36 బైక్లు, ట్రాలీ ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఏసీపీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలన్నారు. హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనాలు నడుపాలన్నారు. సైబర్ క్రైమ్పై యువత అప్రమత్తంగా ఉండాలని, మత్తు పదార్థాలకు బానిస కావొద్దన్నారు. కార్పొరేటర్ సుంకరి మనీషా శివకుమార్, పోలీసులు పాల్గొన్నారు.