వరంగల్ చౌరస్తా, జనవరి8: కాకతీయ మెడికల్ కళాశాల పీజీ మొదటి సంవత్సరం అనస్థీ షియా విద్యార్థిని ధరావత్ ప్రీతి ఆత్మహత్య కేసు విచారణలో యాంటీ ర్యాగింగ్ కమిటీ సోమవారం పునఃవిచారణ జరిపి సైఫ్ సస్పెన్షన్ కొనసాగించాలని నిర్ణయించింది. ప్రీతిని వేధించాడని సెకండియర్ అనస్థీషియా విద్యార్థి సైఫ్ అలీపై వచ్చిన ఆరోపణల్లో వాస్త వం ఉందని నమ్మిన కమిటీ గతంలో తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ సస్పెన్షన్ సరైనదిగా మరోమారు తీర్మానించింది. తాను రి మాండ్లో ఉన్న సమయంలో యాంటీ ర్యా గింగ్ కమిటీ తనను విచారించకుండానే తీర్మా నం చేసినట్లు సైఫ్ అలీ హైకోర్టులో తెలియజేయడంతో న్యాయమూర్తి నిందితుడిని సైతం విచారించి తగు తీర్మానం చేయాలని సూచి స్తూ ఆదేశాలు జారీ చేయడంతో పునఃవిచారణ చేపట్టారు.
మొదటిసారి విచారణకు హాజ రు కాకపోవడంతో వాయిదా వేసి, మరో అవకాశాన్ని కల్పించింది. సోమవారం మరోసారి నిందితుడి తరఫు లాయర్ ముందే విచారించి న కమిటీ గతంలో చేసిన తీర్మానం సరైనదేనని తేల్చుతూ మరో తీర్మానం చేసింది. దాంతో పాటుగా కోర్టు ఉత్తర్వుల అనంతరం విచారణకు హాజరుకాకుండా విధులకు హాజరైన 97 రోజుల కాలాన్ని సైతం కలుపుకొని 2024 జూన్8వ తేదీ వరకు సస్పెన్షన్ కాలాన్ని పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు కేఎంసీ ప్రిన్సిపా ల్ మోహన్దాస్ ఒక ప్రకటనలో తెలిపారు.