ములుగు (నమస్తే తెలంగాణ)/ములుగు టౌన్, డిసెంబర్ 3 : అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ములుగు నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ధనసరి అనసూయ (సీతక్క) బీఆర్ఎస్ అభ్యర్థి బడే నాగజ్యోతిపై 33,700 ఓట్లతో విజయం సాధించారు. మొత్తం 1,85,830 ఓట్లు పో లవగా, 1,767 పోస్టల్ ఓట్లు ఉద్యోగులు వినియోగించుకున్నారు. సీతక్కకు 1,02,267 ఓట్లు రాగా బీఆర్ఎస్ అ భ్యర్థికి 68,567 ఓట్లు వచ్చాయి. బీజేపీ నుంచి పోటీ చేసిన అజ్మీరా ప్రహ్లాద్కు 5,388 ఓట్లు మాత్రమే వచ్చాయి. మొ త్తం 14 టేబుళ్లపై 22 రౌండ్లలో ఓట్లను లెక్కించగా ప్రతి రౌండ్లో కాంగ్రెస్ అభ్యర్థి తన ఆధిక్యాన్ని ప్రదర్శించారు. పోస్టల్ ఓట్లలో సైతం సీతక్క 1,358 ఓట్లను సాధించగా, బడే నాగజ్యోతికి కేవలం 240మాత్రమే వచ్చాయి. దీంతో సీతక్క నాగజ్యోతిపై 33,700 ఓట్లతో గెలుపొందారు.
పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో ఎవరికీ ఓటు వేయడం ఇష్టం లేదని నియోజకవర్గంలోని 303 పోలింగ్ కేంద్రాలకు చెం దిన 1,931 మంది ఓటర్లు నోటాను ఎంచుకున్నారు. మొ దటి మూడు స్థానాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నిలువగా బీఎస్పీకి 1,347, స్వతంత్ర అభ్యర్థులు మద్దెల వెంకటేశ్వర్లుకు 3,709, వజ్జ సమ్మక్కకు 1,538, నునావత్ చంద్రునాయక్కు 1704, బంగారి నరేశ్ 483, మల్యాల మనోహర్కు 353, కొప్పుల సమ్మయ్యకు 300, వజ్జ జ్యోతిబసుకు 190 ఓట్లు వచ్చాయి. కాగా, పోస్టల్ బ్యాలెట్లో 14ఓట్లు చెల్లకుండా పోయాయి. ములుగు కలెక్టరేట్లోని ఈవీఎం గోదాములో పోలీస్ బందోబస్తు నడుమ ఆదివారం నిర్వహించిన ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా ముగిసింది. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి, రిటర్నింగ్ అధికారి, ఐటీడీఏ పీవో అంకిత్ విజయం సాధించి న సీతక్కకు ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు.
జయశంకర్ భూపాలపల్లి, (నమస్తే తెలంగాణ) : భూపాలపల్లి అసెంబ్లీ స్థానానికి కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన గండ్ర సత్యనారాయణరావు బీఆర్ఎస్ అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డిపై 52,699 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో గల సిం గరేణి మినీ ఫంక్షన్ హాల్లో ఆదివారం జిల్లా కలెక్టర్ భవేశ్మిశ్రా పర్యవేక్షణలో ఓట్లను లెక్కించారు. నియోజకవర్గం లోని 317 పోలింగ్ కేంద్రాల పరిధిలో మొత్తం 2,24,858 ఓట్లు పోల్ కాగా, గండ్ర సత్యనారాయణకు 1,23,116, గండ్ర వెంకటరమణారెడ్డికి 70,417 ఓట్లు వచ్చాయి. నోటాకు 830 రాగా, 96 రిజెక్ట్ అయ్యాయి. బీఆర్ఎస్ అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డికి 241, కాంగ్రెస్ అభ్యర్థి గండ్ర సత్యనారాయణరావుకు 850, బీజేపీ అభ్యర్థి చందుపట్ల కీర్తిరెడ్డికి 121 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వచ్చాయి.
బీజేపీ అభ్యర్థి చందుపట్ల కీర్తిరెడ్డికి 14,731 ఓట్లు, అలియన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ పార్టీ అభ్యర్థి తాళ్లపల్లి రమేశ్గౌడ్కు 3,464, స్వతంత్ర అభ్యర్థి మంతెన సంపత్కు 2,901, బహుజన సమాజ్ అభ్యర్థి గజ్జి జితేందర్కు 2,010, ఆబాద్ పార్టీ అభ్యర్థి అడ్లకొండ స్రవంతికి 1,130, తెలంగాణ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థి వంగర సాంబయ్య కు 1,012, మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థి అస్రఫ్ మహ్మద్కు 916, ధర్మ సమాజ్ అభ్యర్థి కొ త్తూరి రవీందర్కు 661, భారత్ సమాజ్ డెవలప్ పార్టీ అభ్యర్థి చేపూరి ఓదెలుయాదవ్కు 179, రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (సెక్యులర్) అభ్యర్థి దేవరాజుకు 157, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్టు, లెనినిస్టు(లిబరేషన్) అభ్యర్థి మారెపల్లి మల్లయ్యకు 145, సోషల్ జస్టిస్ పార్టీ ఆఫ్ ఇండి యా అభ్యర్థి రత్న పోశమ్మకి 389, భారతీయ స్వదేశీ కాంగ్రెస్ అభ్యర్థి రమేశ్ గుప్తకి 240, జన శంఖారావం అభ్యర్థి సదా అఖిల్రెడ్డి 314, స్వతంత్ర అభ్యర్థులు అల్లం మహేశ్కు 833, కౌటం రవీందర్కు 328, పొన్నం బుచ్చయ్యకు 275, జీ రజినికి 491, వావిలాల లక్ష్మణ్కు 463, గొడుగు సాహిత్కు 280, సిరిపల్లి రాజయ్యకు 406 ఓట్లు వచ్చాయి.