నల్లబెల్లి, జూలై 12 : అభివృద్ధికి కేరాఫ్గా టీఆర్ఎస్ ప్రభుత్వం నిలుస్తోందని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. మండలంలోని మామిండ్లవీరయ్యపల్లె గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పెద్ది సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ మేరకు వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే పెద్ది మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఎందరో కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు. అలాగే, పార్టీ ఉప్పు తిని పార్టీకే ద్రోహం చేస్తున్న వారిని అధినేత క్షమించరన్నారు. పార్టీని నమ్ముకుని దాని బలోపేతానికి కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుదన్నారు. ప్రతీ టీఆర్ఎస్ కార్యకర్త సైనికుల్లా పని చేసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్టీలో చేరిన వారిలో కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు కూస చెన్నారెడ్డి, పొన్నాల బుచ్చిరెడ్డి, యార రాజు, పొన్నర్సు వెంకటేశ్, నాగరాజుపల్లె నుంచి ముస్కు మహిపాల్తోపాటు మరో పది కుటుంబాల కార్యకర్తలు ఉన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ ఊరటి అమరేందర్రెడ్డి, క్లస్టర్ బాధ్యులు మామిండ్ల మోహన్రెడ్డి, గోటుకుల బుచ్చిరెడ్డి, ముత్యాల సాంబయ్య, ఎరుకల శంకర్, సంపత్, యార రవి, అడ్డగట్ల శంకర్, పెంతల సాంబయ్య, కుమారస్వామి, గోపిరెడ్డి, సాయిరాజ్, సురేశ్, రాజు, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
అధికారులు 24 గంటలూ పనిచేయాలి
నెక్కొండ : రానున్న 48 గంటలూ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉంటూ 24 గంటలూ పని చేయాలని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి సూచించారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ జాటోత్ రమేశ్ అధ్యక్షతన ప్రజాప్రతినిధులు, అధికారులతో మంగళవారం ఆయన సమీక్షించారు. అత్యవసర సమయాల్లో ప్రభు త్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, మహిళా సం ఘాల భవనాలు, ఆరోగ్య ఉపకేంద్రాల భవనాలను వినియోగించుకోవాలని సూచించారు. ప్రజలు స్వీయ జా గ్రత్తలు పాటించాలన్నారు. ఇప్పటి వరకు మండలంలో నాలుగు ఇండ్లు కూలిపోయాయని చెప్పారు. కార్యదర్శులు శిథిల ఇండ్లను పరిశీలించి, ప్రాణనష్టం జరుగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సీజనల్ వ్యా ధులు ప్రబలకుండా పారిశుధ్య పనులు చేపట్టాలన్నారు. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఔషధాలను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. రోడ్లపై గుంతలు ఏర్పడితే తక్షణమే మరమ్మతు చేయించాలని ఆదేశించారు. పంటలను కాపాడుకునేందుకు రైతులు సస్యరక్షణ చర్య లు చేపట్టాలన్నారు. సమావేశంలో జడ్పీటీసీ లావుడ్యా సరోజనా హరికిషన్, నెక్కొండ, రెడ్లవాడ సొసైటీ చైర్మ న్లు మారం రాము, జలగం సంపత్రావు, తహసీల్దార్ డీఎస్ వెంకన్న, ఎంపీడీవో సుగుణకుమార్ పాల్గొన్నారు. అనంతరం నెక్కొండకు చెందిన అనుముల వెం కటేశ్వర్లు మనవడు రక్తహీనతతో బాధపడుతుండగా అతడికి వైద్య చికిత్స కోసం రూ.2.50 లక్షల సీఎంఆర్ఎఫ్ ఎల్వోసీ ఎమ్మెల్యే పెద్ది అందజేశారు. తర్వాత ఇటీవల నెక్కొండ, అప్పల్రావుపేటలో పలువురు మృతిచెందగా బాధిత కుటుంబాలను పరామర్శించారు.