నర్సంపేట రూరల్, సెప్టెంబర్ 11: ప్రపంచ దేశాలను సైతం తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఆకర్శిస్తున్నాయని, దీంతో తెలంగాణ ఖ్యాతి నలుదిశలా వ్యాప్తి చెందిందని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నర్సంపేట మండలం గురిజాల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఎన్ఎస్యూఐ వరంగల్ జిల్లా కోఆర్డినేటర్ అల్లి అనిల్, ఇదే గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు గొడిశాల అశోక్తో పాటు మరికొంత మంది బీఆర్ఎస్లో చేరారు. వీరికి ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో అమలవుతున్న పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్శితులై వివిధ పార్టీలకు చెందిన వారంతా బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారన్నారు. ప్రపంచ దేశాలు తెలంగాణ అభివృద్ధి, సంక్షేమ పథకాల వైపు చూస్తున్నాయన్నారు. కార్యకర్తల సంక్షేమానికి కృషి చేస్తానని, పార్టీలో చేరిన వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటానని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో చెన్నారావుపేట మాజీ ఎంపీపీ జక్క అశోక్ యాదవ్, గురిజాల ఉప సర్పంచ్ మంచిక హరీశ్కుమార్, న్యాయవాది మోటూరి రవి, బీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు అల్లి రవి, గ్రామ పార్టీ అధ్యక్షుడు చిన్నపెల్లి నర్సింగం, అల్లి రాజ్కుమార్, కుమారస్వామి, రవి, రాజు పాల్గొన్నారు.