ఇన్నేండ్లు అన్నదాతలకు కాంగ్రెస్ చేసింది శూన్యం
ఆ పార్టీ పాలిత ప్రాంతాల్లోనూ రైతులంటే పట్టని వైనం
తెలంగాణలో ‘డిక్లరేషన్’ అంటూ కొత్త అవతారం
నేడు అక్కంపేటకు టీపీసీసీ చీఫ్
పరకాలలో భగ్గుమంటున్న గ్రూపు రాజకీయాలు
అయోమయంలో ఉమ్మడి జిల్లా నేతలు
నిన్నమొన్నటిదాకా కాంగ్రెస్తో పెద్దగా సంబంధం లేని వ్యక్తి ఇప్పుడు టీపీసీసీ అధ్యక్షుడై రైతుల పేరు చెప్పుకొని రాజకీయం చేసేందుకు వస్తుండడంపై ‘హస్తం’ శ్రేణుల్లోనే విస్మయం నెలకొంది. సుమారు 60 ఏళ్లు దేశాన్ని పాలించి, ఇప్పుడు కూడా ఆ పార్టీ పాలిత ప్రాంతాల్లో అన్నదాతల గురించి ఆలోచించని కాంగ్రెస్, తెలంగాణలో ఏదో చేస్తామని ‘వరంగల్ డిక్లరేషన్’ పేరిట మాయ చేస్తుండడంపై ఆ పార్టీ నేతల్లోనే అయోమయం కనిపిస్తున్నది. డిక్లరేషన్తో రైతులకు ఏం చేస్తారో చెప్పేందుకే ఆత్మకూరు మండలం అక్కంపేటలో నేడు నిర్వహించే సభకు టీపీసీసీ ప్రెసిడెంట్ హాజరవుతున్నారని పార్టీ నాయకులు చెబుతున్నా, రేవంత్ పర్యటన పరకాల నియోజకవర్గ నేతల్లో మరోసారి వర్గపోరును బహిర్గతం చేస్తున్నది. గత ఎన్నికల్లో పోటీ చేసిన వారే నియోజకవర్గ ఇన్చార్జిగా ఉంటారని ఒకరు, వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కేవారే ఇన్చార్జి అని మరొకరు పోటీ పడుతుండడం.. ఉన్న కొద్దిపాటి కార్యకర్తలకు కూడా తలనొప్పి వ్యవహారంలా తయారైంది.
వరంగల్, మే 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ప్రజల చేతిలో పదే పదే తిరస్కారానికి గురవుతున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కొత్త అవతారంలో వస్తున్నది. ‘వరంగల్ డిక్లరేషన్’ పేరిట రైతులను మాయ చేసేందుకు ఓ కార్యక్రమాన్ని పెట్టుకున్నది. హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం అక్కంపేటకు టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి శనివారం వస్తుండగా రైతులకు కాంగ్రెస్ ఏం చేస్తుందో చెప్పేందుకే ఈ కార్యక్రమమని ఆ పార్టీ నేతలు అంటున్నా కాంగ్రెస్తో పెద్దగా సంబంధంలేని రేవంత్రెడ్డి రాకతో పరకాల నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాలు మరోసారి బట్టబయలయ్యాయి. గత ఎన్నికల్లో పోటీ చేసిన వారే నియోజకవర్గ ఇన్చార్జిగా ఉంటారని ఒకరు, వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేవారే ఇన్చార్జి అని మరొకరు పోటీ పడుతుండడంతో టీపీసీసీ అధ్యక్షుడి పర్యటన వర్గపోరును బహిర్గతం చేసింది.
శ్రేణులు దూరం..
పరకాల నియోజకవర్గంలో కాంగ్రెస్ తరఫున గత ఎన్నికల్లో కొండా సురేఖ పోటీ చేశారు. రేవంత్రెడ్డి కా ర్యక్రమానికి ఈమె దాదాపుగా దూరంగానే ఉంటున్నా రు. 2014లో ఈ స్థానంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి న ఇనుగాల వెంకట్రామారెడ్డి నియోజకవర్గ ఇన్చార్జిగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీంతో రెండు వర్గాల శ్రేణు ల్లో అయోమయం నెలకొంది. గ్రూపు రాజకీయాల కా రణంగా ఉన్న కొద్దిపాటి కాంగ్రెస్ కార్యకర్తలు కూడా కార్యక్రమానికి దూరంగానే ఉంటున్నారు. పరకాల ని యోజకవర్గంలో రేవంత్రెడ్డి పర్యటనను పట్టించుకునే వారే లేకపోవడంతో డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్రెడ్డి స్వయంగా ఏర్పాట్లు చూసుకుంటున్నారు.
రైతుల విముఖత…
రైతుల పేరు చెప్పుకొని రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్న కాంగ్రెస్ తీరుపై రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నన్ని రో జులు రైతులకు ఏం చేసిందో, 2014కు ముందు, ఆ తర్వాత రాష్ట్రంలో వ్యవసాయరంగంలో ఎలాంటి మా ర్పులు వచ్చాయో పోల్చుకుంటున్నారు. తెలంగాణ రా ష్ట్రం ఏర్పడి టీఆర్ఎస్ సర్కారు వచ్చిన తర్వాత ప్రాజెక్టుల నిర్మాణం, 24 గంటల ఉచిత కరంటుతో ప్రతి ఎ కరాకు సాగునీరు అందుతున్నదని చెబుతున్నారు. కాం గ్రెస్ హయాంలో ప్రాజెక్టులు లేక నీరు వచ్చేది కాదని, కరంటు ఎప్పుడు వచ్చేదీ పోయేదీ తెలియకపోయేదని గుర్తు చేసుకుంటున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం గతం లో ఒకసారి రైతు రుణమాఫీ చేసిందని, మరోసారి చే స్తున్నదని ధీమాతో ఉన్నారు. కాంగ్రెస్ రుణమాఫీ ప్రకటనను రైతులు ఎవరూ నమ్మడంలేదని, అందుకే ఈ మాట చెప్పినా ఆ పార్టీని 2018 ఎన్నికల్లో రైతులే ఓ డించారని గుర్తు చేస్తున్నారు. పంటల సాగుకు అవసరమైన పెట్టుబడి కోసం కాంగ్రెస్ హయాంలో వడ్డీ వ్యా పారులపై ఆధారపడాల్సి వచ్చేదని, సీఎం కేసీఆర్ రైతు బంధు రూపంలో ప్రతి ఎకరాకు రూ.10 వేలు ఇస్తున్నారని చెబుతున్నారు. కాంగ్రెస్ ఉన్నప్పుడు రైతు బం ధు, రైతు బీమా, 24 గంటల ఉచిత కరంటు ఎక్కడున్నాయని ప్రశ్నిస్తున్నారు. హస్తం పార్టీ హయాంలో కా లిపోని మోటరు, పేలిపోని ట్రాన్స్ఫార్మర్ లేదని, రైతు ఆత్మహత్యలేని రోజు లేదని గుర్తు చేసుకుంటున్నారు. ఎరువుల బస్తాల కోసం కుస్తీ పట్టాల్సి వచ్చేదని, పంటలకు కనీస మద్దతు ధరలు దక్కేవి కావని చెబుతున్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రోజులు ఇంకా గుర్తున్నాయని, ఇప్పుడు ఆ పార్టీ నేతలు వచ్చి ఏం చెప్పినా నమ్మే పరిస్థితి లేదని స్పష్టం చేస్తున్నారు. రైతులను మాయ చేసేందుకే ‘వరంగల్ డిక్లరేషన్’ అని అందులో ప్రకటించిన పథకాలను కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో అమలు చేయడం లేదు కదా అని నిలదీస్తున్నారు.