నల్లబెల్లి, ఏప్రిల్ 10: నర్సంపేట నియోజకవర్గంలో బీటీరోడ్ల నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి డిమాండ్ చేశా రు. మండలకేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల స మావేశంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గం లో రోడ్లను నిర్మించి రవాణా రంగాన్ని మరింత మెరుగుపర్చేందుకు కేసీఆర్ ప్రభుత్వం రూ. 200.51 కోట్ల నిధులు మంజూరు చేసిందన్నారు. నియోజకవర్గంలోని 160 గ్రామాలను అనుసంధానం చేస్తూ 80 బీటీరోడ్ల నిర్మాణానికి సీఆర్ఆర్, ఎంఆర్ఆర్, పీఎంజేఎస్వై గ్రాంట్ల కింద నిధులు మంజూరైనట్లు చెప్పారు. ఈ పనులకు టెండర్లు, అగ్రిమెంట్లు పూర్తయ్యాయని వివరించారు. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు ఆయా గ్రామాల్లో కంకర పనులు 90 శాతం పూర్తి చేశారన్నారు. మిగిలిన పనులను పూర్తి చేయాల్సిన కాంగ్రెస్ ప్రభు త్వం ఎందుకు నిలిపివేసిందని ప్రశ్నించారు. ప్రధానంగా నల్లబెల్లి మండలంలో 14 బీటీరోడ్లతోపాటు డివిజన్వ్యాప్తంగా జీవో నంబర్ 447ను అనుసరించి, 18 బీటీ రోడ్లకు సీఆర్ఆర్ గ్రాంటు నిధులు రూ. 23 కోట్లు, జీవో నంబర్ 260తో 25 బీటీ రోడ్లకు రూ. 32.56 కోట్లు, జీవో నంబర్ 396 అనుసరించి 13 బీటీ రోడ్లకు రూ. 40.13 కోట్లు, జీవో నంబర్ 242తో 24 బీటీరోడ్ల నిర్మాణానికి రూ. 37.42 కోట్లు మంజూరయ్యాయని వెల్లడించారు. ఈ పనులన్నింటికీ టెండర్లు, అగ్రిమెంట్లు పూర్తయ్యాయని చెప్పారు. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి వెంటనే రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి త్వరగా పనులు పూర్తి చేయించాలని పెద్ది డిమాండ్ చేశారు.
ప్రధానంగా నర్సంపేట నియోజకవర్గానికి సం బంధించిన రవాణా రంగంలో ఇరిగేషన్ శాఖ ద్వారా మంజూరైన రూ. 43.46 కోట్లతో పాటు పీఎంజేఎస్వై గ్రాంటు నిధులు రూ. 24 కోట్లకు సంబంధించిన పనులను రద్దు చేస్తున్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించినట్లు వివిధ పత్రికల్లో కథనాలు వెలువడ్డాయని, ఈ విషయంపై దొంతి ప్రజలకు స్పష్టత ఇవ్వాలన్నారు. అభివృద్ధి చేయాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకట్ట వేయడం శోచనీయమన్నారు. నియోజకవర్గానికి మంజూరైన రోడ్ల నిర్మాణ పనులను వెంటనే చేపట్టకుంటే ఈ నెల 12,13న బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికల కోడ్కు భంగం కలుగకుండా గ్రా మాల్లో పూలతో నిరసన కార్యక్రమాలు చేపడుతామని పెద్ది హెచ్చరించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సారంగపాణి, ప్యాక్స్ చైర్మన్ మురళీధర్రావు, మాజీ ఎంపీపీ కక్కెర్ల శ్రీనివాస్గౌడ్, నాయకులు ప్రవీణ్గౌడ్, గందె శ్రీనివాస్గుప్తా, కోటిలింగాచారి, మాజీ సర్పంచ్ రాజా రాం, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
రంజాన్ పర్వదినం సందర్భంగా మాజీ ఎమ్మె ల్యే పెద్ది సుదర్శన్రెడ్డి మండలకేంద్రంలోని తన నివాసంలో నిరుపేద ముస్లింలకు రంజాన్ కానుకలు పంపిణీ చేశారు. కేసీఆర్ ప్రభుత్వం అన్ని వర్గాలు, అన్ని మతాల ప్రజలకు సమ న్యాయం చేసిందని పెద్ది అన్నారు. పండుగల సమయంలో మతాలకతీతంగా నిరుపేదలకు దుస్తులతోపాటు ప్రత్యేక కానుకలు అందించిందని గుర్తుచేశారు. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం పండుగల వేళ ప్రజలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బీ సారంగపాణి, ప్యాక్స్ చైర్మన్ చెట్టుపెల్లి మురళీధర్రావు, మాజీ ఎంపీపీ కక్కెర్ల శ్రీనివాస్గౌడ్ పాల్గొన్నారు.