హనుమకొండ సబర్బన్, మార్చి 5 : వ్యవసాయ రంగంలో సాంకేతికతను అందిపుచ్చుకునేందుకు ప్రభుత్వం సరికొత్తగా ఆలోచిస్తున్నది. ఈమేరకు గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన రైతువేదికలే కేంద్రంగా వీడియో సలహాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఈమేరకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శాస్త్రవేత్తలు, వ్యవసాయరంగ నిపుణుల సలహాలు, సూచనలతో పాటు పంట క్షేత్రంలో రైతులు ఎదుర్కొనే సమస్యలను నేరుగా తెలుసుకొని తగిన సూచనలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. తొలి విడతగా నియోజకవర్గానికి ఒక సెంటర్ను ఎంపిక చేశారు. వీటిని అన్లైన్ ద్వారా నేడు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు.
గత ప్రభుత్వ హయాంలో హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం గట్లనర్సింగాపూర్లో కావేరి సీడ్స్ ఆధ్వర్యంలో నిర్మించిన రైతువేదికలో ఈ వీడియో కాన్ఫరెన్స్ సలహాల పద్ధతిని ఏ ర్పాటు చేశారు. ఇది విజయవంతం కావడం తో రాష్ట్రవ్యాప్తంగా దీనిని అమలు చేసి రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని భా వించారు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం నియో జకవర్గానికి ఒక కేంద్రాన్ని ఎంపిక చేసి ప్రయోగాత్మకంగా ఆన్లైన్ సలహాల కేంద్రా న్ని ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాకు సంబంధిం చి హసన్పర్తి మండలం పలివేల్పుల క్లస్టర్లో నిర్మించిన రైతువేదికలో అన్ని ఏర్పాట్లు చేయ గా మంగళవారం కలెక్టర్ సిక్తాపట్నాయక్, అదనపు కలెక్టర్ రాధికాగుప్తా పరిశీలించారు.