మంగపేట, జనవరి 8 : కమలాపురం బిల్ట్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు చేయూత అందిస్తామని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. సోమవారం హైదరాబాద్లో మంత్రులు, ఉన్నత స్థాయి అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. 2014 ఏప్రిల్లో ఉత్పత్తి నిలిచిపోయిన విషయంపై చర్చించారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఫ్యాక్టరీ ప్రారంభానికి అవసరమైన ఆర్థిక కార్యకలాపాలపై దృష్టి సారించి, కమలాపురం ప్రాంతంలో ఉపాధి అవకాశాలు మెరుగుపర్చేందుకు ప్రభుత్వం నుంచి అన్ని సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. బిల్ట్ పారిశ్రామిక యూనిట్ పునరుద్ధరణకు ఐటీసీ కూడా సహకరిస్తున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో మంత్రులు సీతక, కొండా సురేఖ, పీఆర్ఎల్సీ పరిశ్రమల శాఖల కార్యదర్శులు, సీఎంవో అధికారులు, ములుగు కలెక్టర్ ఇలా త్రిపాఠి పాల్గొన్నారు.