నర్సంపేట, అక్టోబర్ 5: బీఆర్ఎస్ సర్కారుతోనే మహిళా సాధికారత సాధ్యమని, అందుకోసం సీఎం కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి అన్నారు. గురువారం నర్సంపేటలోని వ్యవసాయ మార్కెట్ ఆవరణలో వీవో భవనాల నిర్మాణాల కోసం నిధుల ప్రొసీడింగ్ కాపీలను మహిళలకు అందించారు. అలాగే, 500 మంది మహిళలకు కుట్టుమిషన్లు పంపిణీ చేశారు. అంతేకాకుండా లబ్ధిదారులకు బతుకమ్మ చీరెలు అందించారు. నర్సంపేట నియోజకవర్గంలోని 197 గ్రామాల యువతకు క్రీడా పరికరాలు పంపిణీ చేశారు. అంతేకాకుండా అఫిషియల్ ప్రోగ్రామ్స్ అండ్ డయిలీ షెడ్యూల్ అప్డేట్ మొబైల్ యాప్ను ప్రారంభించారు.
తర్వాత ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 3176 మందికి కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెద్ది మాట్లాడుతూ గత ప్రభుత్వాలు మహిళల అభివృద్ధిని పట్టించుకోలేదని విమర్శించారు. రాష్ట్రంలో ఆడబిడ్డల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని కొనియాడారు. అతివలకు అన్ని రంగాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని తెలిపారు. మహిళల రక్షణకు రాష్ట్ర సర్కారు ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు. నర్సంపేట నియోజకవర్గంలో మహిళల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు ఎమ్మెల్యే పెద్ది చెప్పారు. డివిజన్వ్యాప్తంగా 3500 మంది మహిళలకు కుట్టు శిక్షణ ఇచ్చి, ఉచితంగా కుట్టుమిషన్లు పంపిణీ చేస్తున్నామన్నారు. మహిళలకు అన్ని రకాల రుణాలు అందించేందుకు కృషి చేస్తానన్నారు.
దమ్ము, ధైర్యం ఉన్న నేత ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆయన ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేగా ఉండడం నర్సంపేట నియోజకవర్గ ప్రజల అదృష్టమన్నారు. పెద్ది ఒక దఫా ఎమ్మెల్యేగా గెలిచినందుకే నర్సంపేట రూపురేఖలు మారిపోయాయన్నారు. పెద్ది ప్రత్యేక విజన్తో ముందుకెళ్తున్నారని కొనియాడారు. నర్సంపేట డివిజన్ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నారని చెప్పారు. నియోజకవర్గానికి సీఎం కేసీఆర్తోపాటు మంత్రులు కేటీఆర్, హరీశ్రావు ఎంతో తోడ్పాటునందించారని తెలిపారు. మరోసారి పెద్దిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే రాష్ట్రంలోనే నర్సంపేట నంబర్వన్ స్థాయికి చేరుకుంటుందన్నారు. కార్యక్రమంలో జడ్పీ ఫ్లోర్లీడర్ పెద్ది స్వప్న, జడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజినీకిషన్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు నాగెల్లి వెంకటనారాయణగౌడ్, ఎంపీపీలు, జడ్పీటీసీలు, పార్టీ మండల అధ్యక్షులు, క్లస్టర్ బాధ్యులు, ఆర్బీఎస్ సభ్యులు, ఏపీఎంలు, గ్రంథాలయ సంస్థ డైరెక్టర్లు పాల్గొన్నారు.