వరంగల్ : సీఎం కేసీఆర్ తెలంగాణ సచివాలయానికి భారత రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టడం చారిత్రాత్మక నిర్ణయమని వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ అన్నారు.
ఈ సందర్బంగా సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలుపుతూ హన్మకొండలోని ఎమ్మెల్యే నివాసం వద్ద సీఎం కేసీఆర్, అంబేద్కర్ చిత్ర పటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..అంబేద్కర్ దేశాభివృద్ధికి ఎంతో కృషి చేశారన్నారు.
సీఎం కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయంతో దళిత, వెనుకబడిన వర్గాల ఆత్మగౌరవం మరింత పెరుగుతుందని వెల్లడించారు. అంబేద్కర్ స్ఫూర్తితో దేశంలో మరెక్కడా లేని విధంగా దళితులను సుసంపన్నం చేసేందుకు గాను దళితబంధు పథకాన్ని ప్రవేశ పెట్టారు.
కేంద్ర ప్రభుత్వానికి చిత్త శుద్ధి ఉంటే నూతన పార్లమెంట్ భవనానికి కుడా డాక్టర్ బాబాసాహెబ్ అంబెద్కర్ పేరు పెట్టాలని ఎమ్మెల్యే రమేష్ డిమాండ్ చేశారు.