బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఈనెల 27న వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొననున్నారు. ఈ మేరకు సభా స్థలాన్ని ఎమ్మెల్యే అరూరి రమేశ్ శుక్రవారం పరిశీలించారు. కాజీపేట-ఉర్సు బైపాస్ రోడ్డులోని భట్టుపల్లిలో సభ నిర్వహణకు పార్టీ శ్రేణులు సన్నద్ధమవుతున్నారు. ప్రజలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉండడంతో ఎక్కడా ఇబ్బందులు రాకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో రెండో సారి సభకు జననేత వస్తుండడంతో గులాబీ శ్రేణుల్లో జోష్ నెలకొంది. మరోవైపు ప్రచారంలో బీఆర్ఎస్ జోరు పెంచింది. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు పోతున్నది.
వరంగల్, అక్టోబర్ 20(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా భారత రాష్ట్ర సమితి ముందుకు సాగుతున్నది. ముందుగానే అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ ప్రచారంలో అన్ని పార్టీల కంటే చాలా ముందున్నది. తొమ్మిదేళ్లలో చేసిన అభివృ ద్ధి, సంక్షేమ పథకాలతో ఆ పార్టీకి ప్రజల్లో ఆదరణ పెరుగుతున్నది. ప్రచారం ప్రక్రియలో భాగంగా బీఆర్ఎస్ అ ధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 27న వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజా ఆశీర్వాద సభకు హాజరవుతున్నా రు. కాజీపేట-ఉర్సు బైపాస్ రోడ్డులోని భట్టుపల్లిలో ఈ సభ జరుగనున్నది. సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ కార్యక్రమం శుక్రవారం ఖరారైంది. వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ ఆధ్వర్యంలో సభ ఏర్పాట్లు మొదలయ్యా యి. నియోజకవర్గ ముఖ్యనేతలతో కలిసి ఎమ్మెల్యే అ రూరి భట్టుపల్లిలోని సభ నిర్వహించే స్థలాన్ని పరిశీలించారు. భారీ జన సమీకరణతో బీఆర్ఎస్ ప్రచార సభ జ రుగనున్నది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 16న జనగామ నియోజకవర్గ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం పాల్గొన్నారు. వర్ధన్నపేట ప్రజా ఆశీర్వాద సభ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొంటున్న రెండో ఎన్నికల ప్రచార సభ కానున్నది.
ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ ముందున్నది. ప్రత్యర్థి పార్టీలు ఇంకా అభ్యర్థులను సైతం ప్రకటించలేదు. బీఆర్ఎస్ అభ్యర్థులు ఇప్పటికే నియోజకవర్గ వ్యాప్తంగా ఒక దశ ప్రచారం పూర్తి చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మరో కీలక మంత్రి తన్నీరు హరీశ్రావు ఇప్పటికే ఉమ్మడి వరంగల్లోని దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ అభ్యర్థులకు భీ ఫారాలు సైతం అందించారు. అన్ని నియోజకవర్గాల్లోని సభలకు స్వయంగా హాజరయ్యేలా ప్రచార షెడ్యూల్ ఖరారు చేశారు. తొలి దశలో జనగామ, వర్ధన్నపేట నియోజకవర్గాల్లో ప్రచార సభల్లో పాల్గొంటున్నారు. రెండోదశలో మిగిలిన నియోజకవర్గాల్లో ప్రచారం చేసేలా త్వరలోనే షెడ్యూల్ రూపొందించనున్నారు.
భారీగా తరలిరావాలి..
సీఎం కేసీఆర్ ఈ నెల 27న మధ్యాహ్నం 2 గంటలకు వర్ధ్దన్నపేట నియోజకవర్గ ప్రజా ఆశీర్వాద సభకు వస్తున్నారని ఎమ్మెల్యే అరూరి రమేశ్ తెలిపారు. గ్రేటర్ వరంగల్ 44వ డివిజన్ పరిధి భట్టుపల్లిలోని ఎస్సార్ కాలేజీ పక్కనున్న స్థలంలో సభ నిర్వహించనున్నట్లు చెప్పారు. సభ నిర్వహణకు అవసరమైన అనుమతులు, ఏర్పాట్లను పూర్తి చేస్తున్నామని తెలిపారు. సభలో వర్ధన్నపేట నియోజకవర్గ అభివృద్ధి, బీఆర్ఎస్ పార్టీ మ్యానిఫెస్టోపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు వివరించనున్నారని చెప్పారు. నియోజకవర్గ ప్రజలు, ఉద్యమకారులు, మహిళలు, యువకులు భారీగా తరలివచ్చి సభను విజయవంతం చేయాలని కోరారు. డీసీసీబి చైర్మన్ మార్నేని రవీందర్రావు, ఎస్సార్ విద్యా సంస్థల అధినేత వరదారెడ్డి, కార్పొరేటర్ ఇండ్ల నాగేశ్వర్రావు, పీఏసీఎస్ చైర్మన్లు ఊకంటి వనం రెడ్డి, మోతపోతుల మనోజ్గౌడ్, జిల్లా నాయకులు పోలెపల్లి రామ్మూర్తి, బుద్దె వెంకన్న, పట్టపురం ఏకాంతం పాల్గొన్నారు.