మహబూబాబాద్, నవంబర్ 20(నమస్తే తెలంగాణ)/మరిపెడ : భారత రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మరోమారు జి ల్లాకు రానున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్ర తి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ప్రజాఆశీర్వాద సభ లు నిర్వహిస్తున్న సీఎం కేసీఆర్ మంగళవారం మరిపెడ బంగ్లాలో జరుగనున్న డోర్నకల్ నియోజకవర్గ ప్రజాఆశీర్వాద సభకు హాజరుకానున్నారు. మధ్యాహ్నం 3:30 గంటలకు సభ జరుగనుండగా, వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై గుడిపూడి నవీన్రావు గెస్ట్హౌస్ పకన ఉన్న విశాలమైన ఖాళీ స్థలంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. గత నెల 27న మహబూబాబాద్ నియోజకవర్గంలోని ప్రజాఆశీర్వాద సభకు సీఎం కేసీఆర్ హాజరయ్యారు. క్యాడర్లో ఉత్సాహం నింపారు. నేడు మరిపెడలో నిర్వహించే ప్రజాఆశీర్వాద సభకు బీఆర్ఎస్ నాయకులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతిరాథోడ్, మహబూబాబాద్ ఎంపీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత, ఎమ్మెల్యే రెడ్యానాయక్, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకల నరేశ్రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్రావు సోమవారం ఏర్పాట్లను పరిశీలించారు. డోర్నకల్ నియోజకవర్గంలోని దంతాలపల్లి, నర్సింహులపేట, మరిపెడ, చిన్నగూడూరు, కురవి, సీరోలు, డోర్నకల్ మండలాల నుం చి పెద్ద ఎత్తున జనం తరలివచ్చే అవకాశం ఉండడంతో అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ప్రచారంలో దూసుకెళ్తున్న బీఆర్ఎస్ డోర్నకల్ అభ్యర్థి, ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్కు సీఎం కేసీఆర్ ప్రజాఆశీర్వాద సభ మరింత ఊపునివ్వనుంది. ప్రతి మండలంలో సమావేశాలు నిర్వహించి జన సమీకరణ బాధ్యతను సర్పంచ్లు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులకు అప్పగించారు. ప్రజాఆశీర్వాద సభకు సుమారు లక్షమంది తరలివచ్చే అవకాశం ఉన్నందున నాయకులు ఏర్పా ట్లు పూర్తి చేశారు. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీల కంటే అధికార అభ్యర్థి డీఎస్ రెడ్యానాయక్ ప్రచారంలో ఎంతో ముందున్నారు. తాజాగా మంగళవారం నిర్వహించే ప్రజాఆశీర్వాద సభతో ఈ జోష్ మరింత పెరగనుంది.
ప్రజాఆశ్వీరాద సభకు నియోజకర్గంలోని డోర్నకల్, మరిపెడ, చిన్నగూడూరు, సీరోల్, నర్సింహులపేట, కురవి, దంతాలపల్లి మండలాలకు చెందిన ప్రజలు, పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో తరలిరానున్నందున పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణకు పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వరంగల్-ఖమ్మం, సూర్యాపేట- మహబూబాబాద్ జాతీయ రహదారుల్లోని బైపాస్ రోడ్ల మీదుగా వాహనాలను తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. సభా వేదిక, ప్రాంగణం, కుర్చీలు, భారీ షామీయానాలతో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాకతో మరిపెడ పట్టణం గులాబీమయమైంది. సీఎం కేసీఆర్ పర్యటన సజావుగా సాగేలా తొర్రూరు డీఎస్పీ వెంకటేశ్వరబాబు నేతృత్వంలో బం దోబస్తు ఏర్పాటు చేశారు.
మరిపెడ బంగ్లాలోని గుడిపూడి నవీన్రావు గెస్ట్హౌస్ సమీపంలో జరుగునున్న ప్రజాఆశీర్వాద సభకు డోర్నకల్ నియోజకవర్గం నుంచి ప్రజలు పెద్దఎత్తున తరలిరావాలి. నియోజకవర్గంలోని ఏడు మండలాల నుంచి తరలివచ్చేలా అన్ని ఏర్పాట్లు చేశాం. సీఎం కేసీఆర్ ఎంతోముందు చూపుతో నిర్మించి ప్రాజెక్టులతో చివరి ఆయకట్టు వరకు గోదావరి జలాలు అందడంతో లక్షలాది ఎకరాల బీడుభూములు సాగులోకి వచ్చాయి. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ శుద్ధి చేసిన తాగునీళ్లు అందడంతో ఆడబిడ్డల కష్టాలు తీరినయి. మరిపెడ పట్టణంలో రూ.36కోట్లతో వంద పడకల వైద్యశాల, ఆకేరువాగుపై చెక్డ్యాం కోసం రూ.50కోట్లు, రహదారుల కోసం రూ.100కోట్ల నిధులు సీఎం కేసీఆర్ మంజూరు చేశారు. మరిపెడ, డోర్నకల్ మున్సిపాలిటీలు స్థిరమైన ప్రగతిని సాధిస్తున్నాయి. గిరిజన తండాలు మొదలు, పల్లె, పట్టణాలను అభివృద్ధి చేసిన కేసీఆర్ పాలన మరో పదేళ్లు కొనసాగాలని తెలంగాణ సమాజం కోరుకుంటున్నది. ప్రజలకు అన్నీతానై వ్యవహరిస్తున్న అభివృద్ధి ప్రదాత సీఎం కేసార్ బహిరంగ సభకు పార్టీలకతీతంగా ప్రజలు తరలిరానున్నారు.
మరిపెడ బంగ్లాలో మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలకు నిర్వహించే ప్రజాఆశీర్వాద సభకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలి. హెలీప్యాడ్ పనులు, సభా వేదిక, సభ ముందు కూర్చొనే ప్రజల కోసం బారికేడ్లు, ఇతర పనులు పూర్తి చేశాం. నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుంచి, ప్రతి తండా నుంచి ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి ప్రజాఆశీర్వాద సభను విజయవంతం చేయాలి.