స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో తండాలు, గూడేల్లో సమగ్రాభివృద్ధి జరిగిందని, బంజారాల నీటి గోస తీర్చిన గొప్ప నేత సీఎం కేసీఆర్ అని రాష్ట్ర గిరిజన, స్త్రీశిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. శనివారం ములుగులో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పోరిక గోవింద్నాయక్ అధ్యక్షతన బంజారాలు, భూపాలపల్లిలో జడ్పీటీసీ జోరుక సదయ్య అధ్యక్షతన ముదిరాజ్ల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి, మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, ములుగు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలో ములుగు, భూపాలపల్లి నియోకవర్గాల్లో ఏమీ అభివృద్ధి జరగలేదని, సీఎం కేసీఆర్ సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా అనేక పథకాలు అమలు చేస్తున్నట్లు పేరొన్నారు. బంజారాల అభివృద్ధికి కృషి చేసిన బీఆర్ఎస్ అభ్యర్థులు గండ్ర వెంకటరమణారెడ్డి, బడే నాగజ్యోతిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
జయశంకర్ భూపాలపల్లి/ ములుగు, అక్టోబర్ 21(నమస్తే తెలంగాణ): ‘కాంగ్రెస్, టీడీపీ హయాంలో తండాలు, గూడేల్లో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా ఉన్నది. తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ తండాలు, గూడేలను గ్రామ పంచాయతీలుగా చేసి సమగ్రభివృద్ధి చేశారు’ అని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. ములుగు జిల్లా కేంద్రంలోని లీలా గార్డెన్లో శనివారం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పోరిక గోవింద్నాయక్ అధ్యక్షతన నిర్వహించిన బంజారాల ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్య అతిథులుగా మంత్రి సత్యవతిరాథోడ్, మానుకోట ఎంపీ మాలోత్ కవిత, జడ్పీచైర్పర్సన్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి, పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్రావు, మాజీ మంత్రి చందూలాల్ తనయకుడు అజ్మీరా ధరమ్సింగ్, రిటైర్డ్ మున్సిపల్ కమిషనర్ భూక్యా దేవ్సింగ్, సీనియర్ నాయకుడు పోమానాయక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సమైక్య పాలనలో గ్రామాలు, తండాలు, గూడేల్లో తాగునీటి కోసం అరిగోస పడ్డారని, మహిళలు నెత్తిన బిందెలు పెట్టుకొని కిలో మీటర్ల మేరా గుక్కెడు నీళ్లకోసం వెళ్లే వారని తెలిపారు. ఉద్యమ నేతగా నాడు మహిళల కష్టాలను చూసిన సీఎం కేసీఆర్ మిషన్ భగిరథ ద్వారా ఇంటింటికీ నల్లానీరు అందించారు. ములుగు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వ హిస్తున్న సీతక్క రెండు సార్లు గెలిచి ఎలాంటి అభివృద్ధి చేయలేదని, బంజారాలకు చేసింది ఏమీ లేదన్నారు. ప్రజల సమస్యలు తీర్చడంలో విఫలమైందన్నారు. సీఎం కేసీఆర్ బంజారాలకు పోడు పట్టాలు అందించి భూములకు హక్కుదారులను చేశార ని, పంట పెట్టుబడి సాయం సైతం అందిస్తున్నారని గుర్తు చేశా రు. బీఆర్ఎస్ ప్రభుత్వం తండాలు, గూడేలకు కూడా త్రీ ఫేజ్ కరెంట్ ఇచ్చారని 10శాతం రిజర్వేషన్ ప్రవేశపెట్టి బంజారాల జీవితాల్లో వెలుగులు నింపిందన్నారు. ములుగును జిల్లాగా ఏ ర్పాటు చేసి అన్ని వసతులతో ప్రభుత్వ దవాఖా నిర్మించినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా సమీకృత కలెక్టరేట్, మెడికల్ కళాశాల సైతం నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ రుణాన్ని బంజారాలు తీసుకునే అవకాశం నాగజ్యోతి రూపంలో వచ్చిందని, పేద బిడ్డ అయిన నాగజ్యోతిని బీఆర్ఎస్ ములుగు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా సీఎం కేసీఆర్ ఎన్నికల బరిలో నిలిపారనారు. బంజారాలంతా నాగజ్యోతిని ఇంటి బిడ్డగా ఆదరిం చి రానున్న ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించి సత్తా చాటాలని మంత్రి సత్యవతి రాథోడ్ పిలుపునిచ్చారు.
ముదిరాజ్లను గుర్తించి, వారిని ఆర్థికగా వృద్ధిలోకి తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఏఎస్ఆర్ గార్డెన్లో జడ్పీటీసీ జో రుక సదయ్య అధ్యక్షతన ముదిరాజ్ల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. కార్యక్రమానికి మంత్రి సత్యవతి రాథోడ్తో పాటు మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మా ట్లాడుతూ.. రాష్ట్రంలో ఎంతో మంది సీఎంలు, రాజకీయ నా యకులను చూశాం. కానీ ముదిరాజ్ల గురించి ఆలోచించింది కేసీఆర్ మాత్రమేనన్నారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువుల్లో పూడిక తీయించడంతో నీటి నిల్వలు పెరిగాయని, ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేయడంతో మత్స్య పరిశ్రమ పెరిగిందన్నారు. చేపలను మార్కెటింగ్ చేయడానికి సబ్సిడీపై ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ట్రాలీలు అందజేశారన్నారు.
బీఆర్ఎస్ భూపాలపల్లి అసెంబ్లీ అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డికి వేసే ప్రతి ఓటు నాకు వేసినట్లుగా భావించాలని మండ లి డిప్యూటీ చైర్మన్ బండాప్రకాశ్ అన్నారు. మత్స్యశాఖలో కొత్త నాయకత్వం రావాలని, దీంతో చేపల పరిశ్రమ మెరుగుపడుతుందన్నారు. తెలంగాణ రాక ముందు 2వేల సొసైటీలు మాత్ర మే ఉండేవని, తెలంగాణ వచ్చాక 5వేలకు చేరిందన్నారు. తాను ఎమ్మెల్సీ అయ్యాక వెయ్యి గ్రామాల్లో సొసైటీలు ఏర్పాటు చే యించానన్నారు. 2016 నుంచి ఉచితంగా చేప పిల్లల పంపిణీ ప్రారంభం కాగా, 62వేల మందికి వాహనాలు ఇచ్చామని, 4వేల ఆటోలను 75శాతం సబ్సిడీతో అందించామని పేర్కొన్నా రు. ముదిరాజ్ బిడ్డ పోలీస్ కిష్టన్న కుమార్తెకు మెడిసిన్ సీటు ఇ ప్పించి పీజీ వరకు ఖర్చులు సీఎం కేసీఆరే భరించారన్నారు. కేసీఆర్తోనే బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి సాధ్యమని, 75 ఏళ్లు పాలించిన కాంగ్రెస్, బీజేపీలు కులగణన ఎందుకు చేయించలేదని ప్రశ్నించారు. దుర్మార్గ చరిత్ర కలిగిన నేతలను నమ్మొద్దని కోరారు. నియోజకవర్గంలోని ముదిరాజ్లు గండ్ర వెంకటరమణారెడ్డికి ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు.
‘బంజారాల కష్టాలను తీర్చిన గొప్ప నేత, బంజారాల ఆరాధ్యదైవం సేవాలాల్ సమానులు సీఎం కేసీఆర్’ అని మానుకోట ఎంపీ మాలోత్ కవిత అన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతిని భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పాలనలో బంజారాల కోసం చేసిందని ఏమీ లేదని, సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం తండాలు, గూడేలను జీపీలుగా చేశారన్నారు. బంజారాలకు పెద్ద దిక్కు సీఎం కేసీఆర్ అని, నాగజ్యోతిని ఆశీర్వదించి అండగా ఉండాలన్నారు. కాంగ్రెస్ నాయకుల మాయ మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు.
తన తల్లిదండ్రులు పీడత ప్రజల కోసం అడవి మార్గాన్ని ఎంచుకొని ప్రాణాలను అర్పించారని, వారి వారసత్వాన్ని పుని కి పుచ్చుకొని ప్రజాసేవ చేసేందుకు సీఎం కేసీఆర్ ఆశీర్వాదం తో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచానని, ప్రజలంతా తనను ఇంటి ఆడబిడ్డగా ఆశీర్వదించి గెలిపించాలని బడే నాగజ్యోతి కోరారు. ప్రజలకు ఎలాంటి కష్టం వచ్చినా తాను అందుబాటులో ఉంటానన్నారు. గ్రామం, తం డాలు, గూడేల్లో ప్రజల కష్టాలు తనకు తెలుసని, ఎమ్మెల్యేగా ఒక్క అవకాశం ఇస్తే నియోజకవర్గంలోని పేదవారికి సొంతిల్లు కట్టించిన అనంతరం తాను ఇల్లు నిర్మించుకుంటానన్నారు. నిండు మనస్సుతో తనను ఆశీర్వదించి గెలిపిస్తే ప్రజల రుణాన్ని తీర్చుకుంటానని పేర్కొన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్రావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నాగజ్యోతి గెలుపునకు నిరంతరం శ్రమించనున్నట్లు వివరించారు. మాజీ మంత్రి చందూలాల్ తనయుడు అజ్మీరా ధరమ్సింగ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోవింద్నాయక్, రిటైర్డ్ మున్సిపల్ కమిషన్ దేవ్సింగ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సూచన మేరకు నాగజ్యోతి గెలుపునకు ముందుంటామని, నాగజ్యోతి గెలుపునకు బంజారాలు సహకరించాలని కోరారు. కారు గుర్తుకు ఓటు వేయాలని సూచించారు. సమావేశంలో పార్టీ సీనియర్ నాయకుడు పోరిక పోమానాయక్, గండ్రకోట సుధీర్యాదవ్, రాందాస్, భూక్యా మురళి, పడ్యా కుమార్, అమర్సింగ్, బంజార మహిళలు పాల్గొన్నారు.
సబ్బండ వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి
సబ్బండ వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. రాష్ట్రంలో భూ పాలపల్లి నియోజకవర్గంలో ముదిరాజ్లను ప్రత్యేకంగా గుర్తించి అన్ని రకాలుగా ఆదుకున్నారన్నారు. ప్రతీ మండలం లో ముదిరాజ్లకు కమ్యూనిటీ హాళ్లు మంజూరి ఇచ్చానని, భూపాలపల్లిలో ముదిరాజ్ కమ్యూనిటీ హాల్కు 30గుంటల స్థలం ఇచ్చి రూ.కోటి మంజూరు చేయించానన్నారు. కాళేశ్వ రం వెళ్లే ప్రధాన రహదారిపై ఒకచోట స్థలాన్ని గుర్తించి రెండు గుంటల్లో పెద్దమ్మ గుడి నిర్మాణానికి కృషి చేస్తానన్నారు. జి ల్లా కేంద్రంలో రూ.2కోట్లతో గిరిజన భవనానికి మంజూరి ఇ చ్చామని, రాబోయే రోజుల్లో నియోజకవర్గంలో ఎంపీపీ, జ డ్పీటీసీ, ముగ్గురు కౌన్సిలర్ స్థానాలు ముదిరాజ్లకు కేటాయిస్తామని తెలిపారు. ఆదరిస్తే రాబోయే ఐదేళ్లు నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తాననారు. అనంతరం ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని సాధించడంతో ఎంతో మందికి పదవులు వచ్చాయన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా చేపల పరిశ్రమను తెలంగాణలో అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం రాష్ట్ర కార్యదర్శి పల్లెబోయిన అశోక్, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు బండి సారంగపాణి, జిల్లా అడ్హక్ కమిటీ చైర్మన్ చిలకల పాణి, జిల్లా ప్రధాన కార్యదర్శి వేముల రాజమౌళి, గణపురం, రేగొండ, చిట్యాల, టేకుమట్ల, మల్హర్ మండల అధ్యక్షులు బంటు రమేశ్, బోయిని సాంబయ్య, మారబోయిన ధనుంజయ, పుట్ట మొగిలి, దాసరి రాజయ్య, సమ్మయ్య, జిల్లా డైరెక్టర్లు తోట గట్టయ్య, హర్షబోయిన సాంబయ్య, దార్ల ఆనంద్, ముదిరాజ్ సంఘ పెద్దలు, కులస్తులు పాల్గొన్నారు.