మహబూబ్నగర్, సెప్టెంబర్ 16(నమస్తే తె లంగాణ ప్రతినిధి) : దశాబ్దాల పాలమూరు ప్ర జలు కల ఆవిష్కృతమైంది. శనివా రం సా యంత్రం 4:45 గంటలకు సిస్టర్న్ నుంచి కృష్ణ మ్మ ఉబికి వచ్చి కరువు నేలను పావనం చేసిం ది. రోజుకు 3,200 క్యూసెక్యుల నీటి ఉధృతితో నార్లాపూర్ నుంచి నీరు పరుగులు తీ సిం ది. కృష్ణా జలాల ఉధృతిని చూసి ఇంజినీరింగ్ అధికారులు, పీహెచ్ఈఎల్ టెక్నికల్ టీం, ఉ న్నతాధికారులు ఆనందంతో ఉ ప్పొంగిపోయారు. పాలమూరు కరువు గోస తీర్చేందుకు 12.30లక్షల ఎకరాలకు సాగు, తాగునీరు అం దించాలన్న సంకల్పంతో చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అట్టహాసంగా ప్రారంభించారు. నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం నార్లాపూర్ వద్ద పీఆర్ఎల్ఐ ప్రాజెక్ట్ పైలాన్ను సీఎం ఆవిష్కరించి కంట్రోల్ రూమ్లో స్విచ్ ఆన్ చేశారు. అనంతరం సిస్టర్న్ వద్ద మొదటి పంపు నుంచి నార్లాపూర్ రిజర్వాయర్లోకి కృష్ణాజలాలు పరుగు పెట్టాయి.
ఈ మహోజ్వ ల ఘట్టాన్ని కండ్లారా చూసిన సీఎం కేసీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలు ఆనందంతో ఉప్పోంగిపోయారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కృష్ణాజలాలకు పుష్పాభిషేకం చేశారు. కృ ష్ణా జలాలను అన్ని గ్రామాలకు పంపించేందుకు ఏర్పాటు చేసిన కలశాలకు శాస్ర్తోక్తంగా పూజలు నిర్వహించి వాటిని మంత్రులు శ్రీనివాస్గౌడ్, సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, ఎమ్మెల్యేలు, అధికారులకు అందజేశారు. కాగా పీఆర్ఎల్ఐ ద్వారా ఉమ్మడి జిల్లాలోని నాగర్కర్నూల్, మహబూబ్నగర్, నారాయణపేట, రంగారెడ్డి, వికారాబాద్, నల్లగొండ జిల్లాలోని 12లక్షల 30 ఎకరాలకు సాగునీరు, 70 మండలాల్లోని 1,226 గ్రామాలకు తాగునీరు అం దనున్నది. నీటిని పంపింగ్ చేసేందుకు 145 మెగావాట్ల బాహుబలి పంపులు ఏర్పాటు చేశారు. ప్రస్తు తం నార్లాపూర్ రి జర్వాయర్ను 8 రోజుల్లో ఒక టీఎంసీ నీటితో నింపి అక్కడి నుంచి ఏదు ల రిజర్వాయర్కు తరలిస్తారు. ఏదులలో ఈ నెలాఖరులో డ్రై రన్ నిర్వహించనున్నారు. ఈ రిజర్వాయర్లోనూ నీటిని నిల్వ ఉంచి అక్కడి నుంచి వట్టెం రిజర్వాయర్కు తరలిస్తారు. అక్టోబర్ రెండో వారంలోగా కరివెనకు కృష్ణాజలాలను తరలిండమే లక్ష్యంగా పెట్టుకున్నారు.
పులకించిన నార్లాపూర్ ..
పాలమూరు-రంగారెడ్ది ఎత్తిపోతల పథకంలో భాగంగా శనివారం ముఖ్యమంత్రి కేసీఆర్ పంపుహౌస్లో స్విచ్ ఆన్ చేసి బాహుబలి మోటర్ను ఆన్ చేయగా కృష్ణమ్మ నార్లాపూర్ రిజర్వాయర్లోకి పరుగులంకించుకున్నది. ఈ జలదృశ్యాన్ని చూసేందుకు చుట్టుపక్కల జనం భారీగా రిజర్వాయర్ వద్దకు చేరుకొని సెల్ఫీలు దిగుతూ పులకించిపోయారు. కేసీఆర్ మళ్లీ రావాలి.. ఆయనే మా దేవుడు.. మా పంటలు పండుతయ్.. మా కడుపులు నిండుతయంటూ ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎక్సైజ్, క్రీడలు, పర్యాటక శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్, వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, గనులు, భూగర్భ జలవనరుల శాఖ మంత్రి మహేందర్రెడ్డి, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి స్మితాసబర్వాల్, ప్రభుత్వ నీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్, ఎంపీలు మన్నె శ్రీనివాస్రెడ్డి, రాములు, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, ఎమ్మెల్యేలు బీరం హర్షవర్ధన్రెడ్డి, మర్రి జనార్దన్రెడ్డి, లక్ష్మారెడ్డి, చిట్టెం రామ్మోహన్రెడ్డి, నరేందర్రెడ్డి, మహేశ్రెడ్డి, జైపాల్యాదవ్, ఉమ్మడి జిల్లా కలెక్టర్లు ఉదయ్కుమార్, రవినాయక్, తేజస్ నందలాల్ పవార్, క్రాంతి, శ్రీహర్ష, వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి, రంగారెడ్డి కలెక్టర్ హరీశ్, ఇతర రాష్ట్రస్థాయి అధికారులు, ప్రాజెక్టుల ఇంజినీర్లు ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.