హనుమకొండ, నవంబర్ 4 : విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దే ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా సంరక్షణ చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందని, అందుకు బీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్ అండగా నిలుస్తారని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. శనివారం హనుమకొండ ఎన్జీవోస్ కాలనీలోని ఎస్వీ కన్వెన్షన్లో విద్యావంతుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు పాల్గొన్నారు. ముఖ్యఅతిథిగా బోయినపల్లి వినోద్కుమార్ పాల్గొని మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి మ హోన్నతమైందన్నారు. ప్రైవేటు విద్యాసంస్థలు, ఉపాధ్యాయుల సమస్యలపై తనకు అవగాహన ఉందన్నారు. తాను ఎంపీగా ఉన్నప్పుడు ప్రైవేట్ ఉపాధ్యాయుల సంరక్షణ చట్టం కోసం ప్రయత్నించానని తెలిపారు. ఈ దిశగా పార్లమెంట్లో ప్రైవేట్ బిల్లు పెట్టాలనే ఆలోచన చేశానన్నారు. రాబోయే రోజుల్లో ఈ దిశగా కృషి చేస్తానని హా మీ ఇచ్చారు. భవన నిర్మాణ కార్మికులకు తీసుకొచ్చిన చట్టం మాదిరిగా ప్రైవేట్ ఉపాధ్యాయులకు సంరక్షణ చట్టం తీసుకురావాలన్నారు. ఈ చట్టాన్ని సాధించేందుకు అసెంబ్లీ ఎన్నికల అనంతరం హైదరాబాద్లో లక్ష మందితో భారీ ప్రదర్శన చేపట్టేందుకు అందరూ సంఘటితంకావాలని పిలుపునిచ్చారు. ఇందుకు తాము కూడా అండగా నిలుస్తామన్నారు. ప్రైవేట్ ఉపాధ్యాయులకు హౌసింగ్ సొసైటీ ద్వారా మేలు జరిగేలా చూస్తామన్నారు.
అలాగే, వడుప్సా భవన నిర్మాణానికి స్థలం, నిధులు మంజూరయ్యేలా కృషి చేయనున్నట్లు తెలిపారు. ప్రైవేట్ విద్యాలయాలకు సాలర్షిప్లు సక్రమంగా అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. త్వరలో జరుగునున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి దాస్యం వినయ్ భాసర్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. చీఫ్విప్ వినయ్భాసర్ మాట్లాడుతూ ప్రైవేట్ విద్యాసంస్థలు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేశానన్నారు. కరోనా కష్టకాలంలో ప్రైవేట్ ఉపాధ్యాయులకు అండగా నిలిచినట్లు గుర్తు చేశారు. ప్రతి ఉపాధ్యాయుడు తన గెలుపు కోసం కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో కుడా చైర్మన్ సుందర్రాజ్ యాదవ్, వడుప్సా తెలంగాణ రికగ్నైజ్డ్ సూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు మాదాల సతీశ్కుమార్, ప్రతినిధులు రమేశ్రావు, ప్రైవేట్ డిగ్రీ కళాశాల యాజమాన్యాల ప్రతినిధి రవీందర్, జూనియర్ కళాశాల యాజమాన్యాల అసోసియేషన్ ప్రతినిధి రామ్మూర్తి, షైన్ విద్యా సంస్థల చైర్మన్ మూగల కుమార్ యాదవ్, రవీంద్రనాథ్, శ్రీకాంత్రెడ్డి, రాజేశ్, ముక్తీశ్వర్ పాల్గొన్నారు.