నర్సంపేట, జూలై 23 : దివ్యాంగులకు అండగా సీఎం కేసీఆర్ ఉన్నారని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. ఆదివారం నర్సంపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దివ్యాంగులకు రూ.1000 రాష్ట్ర ప్రభుత్వం పెంచినందుకు సంబురాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డికి స్వీట్లు తినిపించి, పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్,తెలంగాణ ప్రభుత్వం నిత్యం పాటుపటుపడుతున్నారని తెలిపారు. దివ్యాంగులను అన్ని విధాలుగా ఆదుకుంటున్నారన్నారు. దివ్యాంగులకు అన్ని రంగాల్లో ఉపాధి అవకాశాలను పెంపొందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. దివ్యాంగులు ఆర్థికంగా ఎదుగుదలకు సహాయం చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దివ్యాంగులను గుర్తింపునిచ్చి రూ.3000 పింఛన్కు పెంచింది కేసీఆర్ అని తెలిపారు. దివ్యాంగులకు అన్ని సౌకర్యాలు వర్తింప చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారన్నారు. నడువలేని దివ్యాంగులకు బ్యాట్రీ తో నడిచే సైకిల్స్ను , వినికిడి యంత్రాలను, అన్ని రకాల పరికరాలను అవసరాలను బట్టి మం జూరు చేస్తున్నామని పేర్కొన్నారు.
దివ్యాంగులు కూడా ఆత్మగౌరవంతో ఉండేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం పలు రకాలుగా చేయూతను అందిస్తున్నదని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ప్రతి దివ్యాంగులు ఉపయోగించుకోవాలన్నారు. పెంచిన హామీని నిలబెట్టుకునేలా వెంటనే జీవో నంబర్ 25ను విడుదల చేసిందన్నారు. దివ్యాంగులు సీఎం కేసీఆర్కు అండగా నిలబడాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధిస్తున్నదని తెలిపారు. భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం ముందున్నదన్నారు. అన్ని రంగాల్లోనూ ఇతర రాష్ర్టాల కంటే మొదటి స్థానంలో ఉంటున్నదని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరి సంక్షేమానికి సీఎం కేసీఆర్ పాటుపడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాగృతి దివ్యాంగుల పంఘం జిల్లా అధ్యక్షుడు నూకల కృష్ణమూర్తి, నాయకులు అడ్డ రాజు, ప్రభాకర్, విజయ్, రాజు, లక్ష్మయ్య, ఊర్మిళ, రజిత, శైలజ పాల్గొన్నారు.