వరంగల్, మే 4 : తెలంగాణ రాష్ట్రంలోని పారిశుధ్య కార్మికులకు ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అండగా నిలుస్తూ వారి ఆర్థిక పురోగతికి పాటుపడుతున్నారని నగర మేయర్ గుండు సుధారాణి అన్నారు. పారిశుధ్య కార్మికుల వేతనం రూ.వెయ్యి పెంచిన నేపథ్యంలో గురువారం గ్రేటర్ కార్పొరేషన్ కార్యాలయం ఆవరణలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మేయ ర్ సుధారాణి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
కేసీఆర్ చిత్రపటానికి పారిశుధ్య కార్మికులతో కలిసి ఆమె పాలాభిషేకం చేశా రు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ గత పాలకులకు భిన్నంగా సీఎం కేసీఆర్ పారిశు ధ్య కార్మికుల ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు. తెలంగా ణ ప్రభుత్వం వచ్చిన తర్వాత పలు మార్లు కార్మికుల వేతనాలు పెంచారన్నారు. కార్మికుల సంక్షేమంతో పాటు వారి ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కరోనా కష్ట సమయంలో పారిశుధ్య కా ర్మికులు అందించిన సేవలను మేయర్ కొనియాడారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్, కార్పొరేటర్ దేవరకొండ విజయలక్ష్మి, శానిటరీ ఇన్స్పెక్టర్ శ్యామ్రాజ్, బీఆర్ఎస్ నాయకులు దేవరకొండ సురేందర్, కార్మికులు పాల్గొన్నారు.