రాష్ట్రంలో దళితుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్ద పీట వేస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. శుక్రవారం రాయపర్తి మండలంలోని ఊకల్ గ్రామంలోని దళిత కుటుంబాలకు ప్రత్యేకంగా మంజూరు చేసిన 65 డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణ పనులకు అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన దళితబంధు పథకం లబ్ధిదారుల ఎంపిక అవగాహన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దళితులను అభివృద్ధి చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. వారి కాలనీలన్నీ ధనవంతుల వాడలు కావాలని ఆకాంక్షించారు.
రాయపర్తి, జూలై 29 : రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దళితుల సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నారని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. శుక్రవారం మండలంలోని ఊకల్ గ్రామంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలోని దళిత కుటుంబాలకు ప్రత్యేకంగా మంజూరు చేసిన 65 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణ పనులకు భూమి పూజ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తాలో సర్పంచ్ కుంచారపు హరినాథ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన దళితబంధు పథకం లబ్ధిదారుల ఎంపిక అవగాహన సమావేశానికి మంత్రి ఎర్రబెల్లి ముఖ్యఅతిథిగా హాజరయ్యా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని దళిత కుటుంబాలన్నీ రాజకీయంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, సామాజిక రంగాల్లో అభివృద్ధి చెందాలన్నదే ముఖ్యమంత్రి ప్రధాన లక్ష్యమన్నారు.
మండలంలోని అన్ని గ్రామాల్లోని దళిత కాలనీలన్నింటినీ ధనవంతుల వాడలుగా తీర్చిదిద్దాలనే ఆశయంతో ముందుకు సాగుతున్నారన్నారు. గ్రామంలోని దళిత కుటుంబాల కోసం ప్రత్యేకంగా మంజూరు చేసిన 65 డబుల్ బెడ్ రూం ఇండ్లను అర్హులైన వారికి అధికారులు కేటాయిస్తారన్నారు. దళితబంధు పథకం విషయంలో ఎవరూ ఆం దోళనలకు గురికావొద్దని, రాబోయే రెండేళ్ల కాలంలో నియోజక వర్గంలోని దళిత కుటుంబాలన్నింటికీ పథకాన్ని వర్తింపజేసేందుకు ప్రణాళికలు రూపొందించుకున్నట్లు చెప్పారు. ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులంతా కలసి కట్టుగా పని చేస్తూ గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడిపించుకోవాలని సూచించారు. అంతకు ముందు మంత్రి ఊకల్ ఎస్సీ కాలనీలో కాలినడకన పర్యటించి, చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో వరంగల్ ఆర్డీవో మహేందర్జీ, ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జడ్పీటీసీ రంగు కుమార్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మునావత్ నర్సింహానాయక్, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ ఆకుల సురేందర్రావు, నాయకులు పూస మధు, గారె నర్సయ్య, ఎండీ నయీం, కాంచనపల్లి వనజారాణి, ఉండాడి సతీశ్కుమార్, తహసీల్దార్ కుసుమ సత్యనారాయణ, ఎంపీడీవో గుగులోత్ కిషన్నాయక్, ఎంపీవో తుల రామ్మోహన్, ఏపీవో దొణికెల కుమార్గౌడ్, ఏపీఎం పులుసు అశోక్కుమార్, రాయపర్తి పీఏసీఎస్ చైర్మన్ కుందూరు రాంచంద్రారెడ్డి, గ్రామ ఎంపీటీసీ నార్లాపురం రాజు, మాజీ ఎంపీపీ నాగపురి రాం బాబు, ఇల్లంద మార్కెట్ డైరెక్టర్ కుందూరు యాదగిరిరెడ్డి, బొడ్డు రంగయ్య, రావుల వెంకట్రెడ్డి, గొల్లపల్లి సదాశ్రీను, బద్దం రంగారెడ్డి, మందాడి సుదర్శన్రెడ్డి, కందికట్ల స్వామి, భద్రూనాయక్, బానోత్ హనుమానాయక్, లక్ష్మణ్నాయక్,ఉపేందర్రెడ్డి పాల్గొన్నారు.
మృతుడి కుటుంబానికి పరామర్శ
మండలంలోని కొండాపురం గ్రామానికి చెందిన ఎర్రబెల్లి పెద్ద వెంకటరావు శుక్రవారం ఉదయం మృతి చెందగా విషయం తెలుసుకున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు గ్రామానికి చేరుకుని పెద్ద వెంకటరావు మృతదేహానికి పూలమాల వేసి, నివాళులర్పించారు. అనంతరం మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన వెంట సర్పంచ్ కోదాటి దయాకర్రావు, నాయకులు తేరాల యాకయ్య, ఎనగందుల మురళి, పెదగాని సంతోష్గౌడ్, కొండ యాకయ్య, ఎద్దు రమేశ్ ఉన్నారు.