గులాబీ దళపతి, సీఎం కేసీఆర్ నేడు స్టేషన్ఘన్పూర్కు రానున్నారు. హైదరాబాద్-వరంగల్ హైవేపై మీదికొండ క్రాస్రోడ్డులోని శివారెడ్డిపల్లి శివారులో సోమవారం మధ్యాహ్నం 12.30 గంటలకు జరిగే ప్రజాఆశీర్వాద సభకు ముఖ్యఅతిథిగా హాజరై ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. కేసీఆర్ హైదరాబాద్ నుంచి నేరుగా హెలీకాప్టర్లో సభాస్థలికి రానున్నారు. నియోజకవర్గం నలుమూలల నుంచి లక్ష మందికిపైగా ప్రజలు తరలిరానున్నారు. ఈ నేపథ్యంలో బహిరంగ సభాస్థలిని ఆదివారం బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, నాయకులు పరిశీలించారు. సీఎం రాక సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు.
జనగామ, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ) : గులాబీ దళపతి, ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం మధ్యాహ్నం 12.30 గంటలకు స్టేషన్ఘన్పూర్లో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభకు రానున్నారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి పెద్దఎత్తున ప్రజలను తరలించేందుకు ఏర్పాట్లు పూర్తిచేశారు. సభను విజయవంతం చేసేందుకు బీఆర్ఎస్ శ్రేణులు ఇప్పటికే సన్నాహక సమావేశాలు నిర్వహించి భారీగా జన సమీకరణకు దిశానిర్దేశం చేశాయి. శి వారెడ్డిపల్లి శివారులోని మైదానంలో జరిగే భారీ ఎన్నికల బహిరంగ సభకు సర్వం సిద్ధమైంది. వేదిక, సభా ప్రాంగ ణం, కుర్చీలు, లైటింగ్, షామియానాలు వంటి ఏర్పాట్లతో ముస్తాబైంది. సోమవారం కేసీఆర్ రాకను పురస్కరించుకొని సభా పరిసరాలు సర్వాంగ సుందరంగా, గులాబీమయమైంది. బహిరంగసభ ప్రాంగణం, వేదిక వద్ద ఎలాంటి లోటు రాకుండా అన్నీ సిద్ధం చేశారు. వేదిక నిర్మాణం, బారికేడ్ల ఏర్పాటు, గ్రౌండ్ చదును, లైటింగ్, సౌండ్ సిస్టమ్ వంటి ఏర్పాట్లు పూర్తయ్యాయి. కేసీఆర్ హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో నేరుగా 12.30 గంటలకు సభా స్థలికి చేరుకొని ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడుతారు. ఎన్నికల ప్రచారం దగ్గర పడుతున్న తరుణంలో జరిగే సభ రాజకీయ ప్రాధాన్యం నెలకొనే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా, సీఎం కేసీఆర్ రాక సందర్భంగా అవాంఛనీయ సంఘటలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.
రాఘవాపూర్-నష్కల్ గ్రామాల శివారులోని 50 ఎకరాల్లో స్టేషన్ఘన్పూర్ చరిత్రలో నిలిచిపోయేలా సభ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. జర్మనీ స్ట్రక్షర్ షామియానాలు, వేలాది మంది కూర్చునేందుకు వీలుగా కుర్చీ లు, లక్షలాది మజ్జిగ, మంచినీళ్ల ప్యాకెట్లు, అంబులెన్స్లు, వైద్య బృందాలు, వాహన పార్కింగ్ వంటి అన్ని ఏర్పాట్లు చేశారు. హెలిప్యాడ్ నుంచి సభాస్థలికి 5 నిమిషాల్లో చేరుకొని తిరిగి వెళ్లిపోయేలా హెలిప్యాడ్ నిర్మించారు. లక్ష మం దికి పైగా సామర్థ్యం ఉన్న గ్రౌం డ్లో బారికేడ్లు, షామియానాలు, టెంట్లు, మంచినీటి వస తి కల్పిస్తున్నారు. బందోబస్తు సహా వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు, వీవీఐపీ, వీఐపీల వాహన పార్కింగ్ వంటి అంశాలపై పోలీసు అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
స్టేషన్ ఘన్పూర్ : మండలంలోని శివారెడ్డిపల్లి వద్ద నేడు సీఎం కేసీఆర్ నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభకు స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గం నుంచి స్వచ్ఛందంగా లక్షమంది తరలి వస్తారని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. ఆదివారం బహిరంగ సభ ఏర్పాట్లు, హెలిప్యాడ్ స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీసులకు ఆయన పలు సూచనలిచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ను చూసేందుకు, వారి ప్రసంగాన్ని వినేందుకు పార్టీ శ్రేణులతోపాటు వివిధ వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున తరలిరానున్నారని వివరించారు. పోరాడి సాధించుకున్న రాష్ట్రం లో తొమ్మిదిన్నరేళ్లుగా చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పాటు ప్రతి గ్రామంలో జరిగిన ప్రగతి కళ్లముందు కనిపిస్తున్నదన్నారు. సీఎం కేసీఆర్కు మద్దతు తెలుపాలని ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. తనకు రాజకీయ జీవితాన్ని ఇచ్చిన ఈ నియోజకవర్గ ప్రజలకు సేవ చేసి, వారి కష్ట సుఖాల్లో పాలు పంచుకుని అభివృద్ధి చేయాలనే ప్రత్యేక ప్రణాళికతో ఉన్నానని ఆయన అన్నారు. ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓట్లేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కడియం శ్రీహరి ప్రజలను కోరారు. సోమవారం మధ్యాహ్నం 12.30 గంటల వరకు ప్రజలు బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు సభాస్థలికి చేరుకోవాలని కోరారు.
‘స్టేషన్ఘన్పూర్కుముఖ్యమంత్రి వస్తున్నందున ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సీఎం కేసీఆర్ జనగామను జిల్లా కేంద్రం చేయడంతోపాటు స్టేషన్ఘన్పూర్ను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా మార్చారు. వందలకోట్ల నిధులు ఇవ్వడంతో అద్భుతమైన అభివృద్ధి చేసుకోగలిగాం. దేవాదుల ఎత్తిపోతల ద్వారా అందుతున్న సాగునీరు వ్యవసాయాన్ని పండుగలా మార్చింది. సాగు, తాగునీటికి సమస్య లేదు. అధినేత చెప్పే మాటలు వినాలని ప్రజలు, రైతు కుటుంబాలు సొంత వాహనాల్లో వచ్చేందుకు సిద్ధమవుతున్నారని మా పార్టీ శ్రేణుల ద్వారా సమాచారం అందుతున్నది. బహిరంగ సభకు ఏర్పాట్లు కూడా ఆ స్థాయిలోనే చేస్తున్నాం.”