ములుగు, భూపాలపల్లి నియోజకవర్గాలు గులాబీమయమయ్యాయి. శుక్రవారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలకు లక్షలాది మంది ప్రజలు తరలిరావడంతో జాతరను తలపించాయి.
నియోజకవర్గాల్లోని ఏ దారి చూసినా సభలకు వచ్చేవారితో సందడిగా కనిపించాయి. ఫ్లెక్సీలతో పాటు గులాబీ కండువాలు, జెండాలు వేసుకొని లక్షల మందితో కిక్కిరిసిపోయిన సభలు గులాబీ వనాన్ని తలపించాయి.