పర్వతగిరి, జనవరి 3: పల్లెల అభివృద్ధే సీఎం కేసీఆర్ లక్ష్యమని బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. మండలంలోని వడ్లకొండ, కల్లెడ, ముంజాలకుంట తండా గ్రామాల్లో సుమారు రూ.3కోట్ల 60లక్షలతో చేపట్టిన వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్యార్డులు, రైతు వేదికలు, క్రీడా ప్రాంగణం, ఆరోగ్య కేంద్రం, మహిళా భవనం, అంతర్గత సీసీ రోడ్లను మంగళవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా సీఎం కేసీఆర్ కృషిచేస్తున్నారని తెలిపారు. అందులో భాగంగానే ప్రతి నెల గ్రామ పంచాయతీలకు నిధులు కేటాయిస్తున్నారని పేర్కొన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాల్లో గణనీయమైన అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణాలో అభివృద్ధి, సంక్షేమ పథకాలను తెలంగాణ ప్రభుత్వం మాత్రమే అమలు చేస్తోందన్నారు. రైతు బంధు, రైతు బీమా, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ఆసరా పింఛన్లు, కేసీఆర్ కిట్ వంటి అనేక ప్రజా సంక్షేమ పథకాలను తెలంగాణ ప్రభుత్వం అందిస్తోందని వివరించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సింగ్లాల్, ఎంపీపీ కమల పంతులు, వైస్ ఎంపీపీ రాజేశ్వర్రావు, చిన్నపాక శ్రీనివాస్, సర్పంచులు అమడగాని రాజు, సంపెల్లి శోభ, బండి సంతోశ్గౌడ్, రవీందర్, ఏడుదొడ్ల జితేందర్రెడ్డి, మహ్మద్అలీ, రాపాక నాగయ్య, ఏవో టీవీఆర్ఆర్ ప్రశాంత్కుమార్, ఎంపీటీసీ రేవతి, మాజీ ఎంపీపీ రంగు రజిత, ఉపసర్పంచ్ ఉప్పలయ్య, ఎంపీడీఓ చక్రాల సంతోష్కుమార్, బొట్ల మధు పాల్గొన్నారు.
అరూరి గట్టుమల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబురాలు
సంక్రాంతి పండుగ సందర్భంగా అరూరి గట్టుమల్లు మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబురాలు నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ తెలిపారు. మండలంలోని కల్లెడ గ్రామంలో సంక్రాంతి సంబురాల్లో భాగంగా మహిళలకు ఆటల పోటీలను ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. మహిళల్లో ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని నింపేందుకు ప్రతి గ్రామంలో సంక్రాంతి సంబురాల్లో భాగంగా ముగ్గుల పోటీలు, ఆటల పోటీలు, పాటల పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేయనున్నట్లు తెలిపారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏపీఎం కృష్ణమూర్తి, సర్పంచ్ శోభ, మహిళా సంఘం నాయకులు పాల్గొన్నారు.
27న పర్వతాల గుట్టపై శివాలయ పునరుద్ధరణ
పర్వతగిరి మండల కేంద్రం పర్వతాల గుట్టపై దాదాపు 700 ఏళ్ల చరిత్ర గల శివాలయ పునరుద్ధర ణ ఈనెల 26వ తేదీన విజయవంతం వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ మంగళవారం తెలిపారు. పర్వతాల శివాలయంలో భక్తులకు వసతులు, మూడు రోజుల పాటు జరిగే మహాశివుడి మహాకుంభాభిషేకం, ఉత్సవ కార్యక్రమాల ఏర్పాట్లను ఎమ్మెల్యే పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా భక్తులు భారీ సంఖ్యలో రానున్నందున వసతుల్లో ఎలాంటి లోటు లేకుండా చూడాలని సంబంధిత అధికారులకు, స్థానిక ప్రజా ప్రతినిధులకు సూచించారు. అనంతరం మహాకుంభాభిషేకానికి సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. పీఏసీఎస్ చైర్మన్ మనోజ్కుమార్గౌడ్, మాజీ జడ్పీటీసీ మేడిశెట్టి రాములు, సర్పంచ్ మాలతీ సోమేశ్వర్రావు, ఉపసర్పంచ్ రంగు జనార్ధన్గౌడ్, నాయకులు పట్టపురం ఏకాంతంగౌడ్, రంగు కుమార్గౌడ్, సర్వర్ పాల్గొన్నారు.