జయశంకర్ భూపాలపల్లి, సెప్టెంబర్ 15(నమస్తే తెలంగాణ) : ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు వైద్య విద్యలో సరికొత్త చరిత్ర సృష్టించారని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నా రు. శుక్రవారం రాష్ట్రంలోని తొమ్మిది ప్రభుత్వ మెడిక ల్ కళాశాలలను సీఎం వర్చువల్గా ప్రారంభోత్సవం చేశారు. ఈ క్రమంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ మెడికల్ కళా శాలను సీఎం వర్చువల్గా ప్రారంభించారు. మంత్రి సత్యవతితో పాటు ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, జడ్పీ చైర్పర్సన్ జక్కు శ్రీహర్షిణి, పెద్దపల్లి జడ్పీ చైర్ పర్సన్ పుట్ట మధు, రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి, కలెక్టర్ భవేశ్మిశ్రా, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి హాజరై ‘జూమ్’ ద్వారా తిలకించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. సీఎం కేసీఆర్ అందని ద్రాక్షలా ఉన్న వైద్య విద్యను పేదింటి బిడ్డకు చేరువ చేశాడన్నారు. స్వరాష్ట్రంలో పదేళ్లలో 21 మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేసి ఏడాదికి 10వేల మంది డాక్టర్లను తయారు చేస్తున్నార న్నారు. ప్రతీ లక్ష జనాభాకు 22 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి తీసుకొచ్చాడన్నారు. వడ్లు పండించ డంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్వన్ స్థానం లో నిలిచిందని, అలాగే ఇప్పుడు వైద్యులను తయారు చేయడంలోనూ దేశంలో ముందంజలో నిలుస్తున్నద న్నారు. గతంలో నా కొడుక్కి మెడిసిన్లో 3వేల ర్యాంకు వచ్చినా ఆందోళన చెందామని, అదృష్టవశాత్తు సెకండ్ రౌండ్లో సీటు వచ్చిందన్నారు. నా కొడుకు స్నేహితులు రష్యా, ఉక్రెయిన్ లాంటి దేశాల్లో లక్షలాది రూపాయలు వెచ్చించి విద్యనభ్యసించినట్లు తెలిపారు. అయినప్పటికీ అక్కడి డిగ్రీ ఇక్కడ అనుమతించరని , మళ్లీ ఫెలోషిప్ చేయాల్సిన పరిస్థితి ఉంటుందన్నారు.
ఈ సమస్యను గమనించిన సీఎం కేసీఆర్ కేంద్రం వివ క్ష చూపినా స్వరాష్ట్ర నిధులతో 21 ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేసి తెలంగాణ పేద విద్యార్థుల కు అండగా నిలిచారన్నారు. ఈ అవకాశాన్ని అందిపు చ్చుకుని ఉత్తమ డాక్టర్లుగా రాణించి రాష్ర్టానికి సేవ చేయాలని కోరారు. ఈ సందర్భంగా కలెక్టర్ భవేశ్మి శ్రా, అడిషనల్ కలెక్టర్ ఉమాశంకర్, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ రాజుదేవ్డే వైద్య విద్యార్థులతో మాట్లాడా రు. వారు ఎక్కడెక్కడి నుంచి వచ్చారని పరిచయం చేసుకున్నారు. కళాశాలలో ఎలా విద్యనభ్యసించాలి, క్రమశిక్షణ తదితర అంశాలపై చర్చించారు. కళాశాలలో ఎలాంటి సమస్యలు ఉన్నా మాకు తెలియజేయాలని కోరారు. అడిషనల్ కలెక్టర్ ఉమాశంకర్ బీహార్కు చెందిన వాడు కావడంతో ఆలిండియా కోటా కింద వచ్చిన బీహార్ విద్యార్థిని రతన్ప్రియతో ప్రత్యేకంగా ముచ్చటించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్స న్ సెగ్గం వెంకటరాణి, వైస్ చైర్మన్ కొత్త హరిబాబు, జడ్పీ వైస్ చైర్మన్ కళ్లెపు శోభారఘుపతిరావు, బీఆర్ ఎస్ అర్బన్ అధ్యక్షుడు కటకం జనార్దన్, జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పోలుసాని లక్ష్మీన రసింహారావు, పీఏసీఎస్ చైర్మన్లు మేకల సంపత్యాద వ్, పూర్ణచందర్రెడ్డి, ఎంపీపీ మందల లావణ్యాసాగర్రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ బుర్ర రమేశ్గౌడ్, జిల్లా వైద్యాధికారి శ్రీరాం, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కోడూరి నవీన్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
అభివృద్ధి నిరోధకులకు బుద్ధి చెప్పండి ; బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి
దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతున్నా ప్రతిపక్షాలకు కంటికి కనిపించడం లేదు. సీఎం కేసీఆర్ తెలంగాణకు మెడికల్ కళాశాలను మంజూరు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసినా పెడచెవిన పెట్టింది. ఈ విషయాన్ని ఛాలెంజ్గా తీసుకున్న కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో జరుగుతు న్న అభివృద్ధిని అడ్డుకోవడమే ప్రతిపక్షాలు లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి. వారి పాలిత రాష్ర్టాల్లో అమలు చేయని పథకాలను ఇక్కడ అమలు చేస్తామని కొత్త డ్రామాలతో ముందుకు వస్తున్నారు.
కేంద్రానికి చెంప పెట్టు..; ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
మెడికల్ కళాశాలల మంజూరులో రాష్ట్రం పట్ల కేంద్రం వివక్ష చూపినప్పటికీ సీఎం కేసీఆర్ స్వరా ష్ట్ర నిధులతో జిల్లాకో మెడికల్ కళాశాల ఏర్పాటు చేసి కేంద్రానికి చెంప పెట్టులా బుద్ధి చెప్పారు. ఏ రాష్ట్రంలోనూ అక్కడి ప్రభుత్వాలు తెలంగాణలో ఏర్పాటు చేసినంతగా మెడికల్ కళాశాలలను ఏ ర్పాటు చేయలేదు. సీఎం కేసీఆర్ అందిస్తున్న ఈ సహకారంతో వైద్య విద్యార్థులు పట్టుదలతో చది వి తల్లిదండ్రులకు, రాష్ర్టానికి పేరు తీసుకురా వా లి. ఎలాంటి సమస్యలున్నా మాకు చెబితే పరిష్క రిస్తాం. స్థానికంగా ఎల్లవేళలా అందుబాటులో ఉంటా. మెడికల్ కళాశాలలో చదువుతున్న విద్యా ర్థుల కోసం రామప్ప కాలనీలో హాస్టల్ సౌకర్యాన్ని ఏర్పాటు చేశాం. మెడికల్ కళాశాల ప్రారంభంతో జిల్లా ప్రజలకు అన్ని రకాల నాణ్యమైన వైద్యం అందుబాటులోకి వచ్చినట్లే.