గులాబీమయమైన రెండు నియోజకవర్గాలుములుగు/ జయశంకర్ భూపాలపల్లి, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు ములుగు, భూపాలపల్లి నియోజకవర్గాల్లో నిర్వహించనున్న ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొననున్నారు. మొదట మధ్యాహ్నం 3 గంటలకు ములుగు జిల్లా కేంద్రంలోని బండారుపల్లి రోడ్డు పక్కన తంగేడు మైదానంలో అభ్యర్థి బడే నాగజ్యోతి ఆధ్వర్యంలో నిర్వహించనున్న సభకు కేసీఆర్ హాజరవుతారు. ఆయన ప్రత్యేక హెలిక్యాప్టర్ ములుగుకు చేరుకోనున్నారు. లక్ష మంది హాజరయ్యే సభ కు బీఆర్ఎస్ శ్రేణులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. నియోజకవర్గంలోని ఏడు మండలాలతో పాటు మహబూబాబాద్ జిల్లాలోని 2 మండలాల నుంచి ప్రజలు తరలిరానున్నారు. మండలానికి 10వేల మంది చొప్పున తరలించి జిల్లా కేంద్రం నుంచి అత్యధికంగా ప్రజలను తరలించే నే తలు ప్లాన్ చేశారు. సభా ప్రాంగణానికి 500 మీటర్ల దూ రంలో ప్రత్యేక హెలిప్యాడ్ను సిద్ధం చేశారు. సభకు వచ్చే ప్రజల కోసం లక్ష కుర్చీలతో పాటు సౌకర్యాలు కల్పిస్తున్నా రు. గురువారం ఉదయం ఎస్పీ గౌష్ఆలం రక్షణ ఏర్పాట్ల ను పోలీస్ అధికారులతో కలిసి పరిశీలించారు. సాయం త్రం నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి, మండలాల ఇన్చార్జిలు పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, ఏరువ సతీశ్రెడ్డి, సాంబారి సమ్మారావు, మెట్టు శ్రీనివాస్ ఏర్పాట్లను పర్యవేక్షించారు.
బీఆర్ఎస్ జయశంకర్ జిల్లా కార్యాలయం వెనక ఏర్పాటు చేస్తున్న ప్రజా ఆశీర్వాద సభకు వేదికను సిద్ధం చేశారు. సుమారు లక్ష మందికి సరిపోయేలా ఏర్పాట్లు చేశారు. నేడు సాయంత్రం 4గంటలకు మంజూర్నగర్లోని కలెక్టరేట్ వద్ద గల హెలిప్యాడ్ వద్దకు సీఎం కేసీఆర్ చేరుకుంటారు. అక్కడి నుంచి కారులో సభా స్థలికి చేరుకుంటారు. ఈ సందర్భంగా సభా స్థలి, హెలిప్యాడ్ను ఎమెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి, నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి బస్వరాజు సారయ్య గురువారం పరిశీలించారు. వాహనాల పార్కింగ్కు ప్రత్యేక స్థలాలు కేటాయించారు. బీఆర్ఎస్ జిల్లా కార్యాలయానికి ఎదురుగా ఉన్న స్థలంతో పాటు సన్వ్యాలీ పాఠశాల సమీపంలో, సభా స్థలికి సమీపంలో సింగరేణి ఇసుక నిల్వ చేసే ఖాళీ స్థలాలను పార్కింగ్ కోసం పోలీసులు కేటాయించారు. ఎస్పీ కిరణ్ప్రభాకర్ ఖారె, భూపాలపల్లి డీఎస్పీ రాములు బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్ నుంచి ప్రత్యేక పారా మిలటరీ పోలీస్ బలగాలు ఇప్పటికే భూపాలపల్లికి చేరుకున్నాయి. డీఎస్పీ రాములు పోలీసులకు విధులు కేటాయించారు. ఎమ్మెల్యే గండ్ర, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి, నియోజకవర్గ ఇన్చార్జి బస్వరాజు సారయ్య పార్టీ శ్రేణులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలోని ప్రతి మండలం నుంచి 10వేల మందిని సమీకరించాలని ఆయా మండలాల ఇన్చార్జిలను ఆదేశించారు. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నాయకులతో పాటు పట్టణ బీఆర్ఎస్ నాయకులు ఆయా వార్డుల నుంచి 30వేల మందిని సమీకరించాలని ఎమ్మెల్యే కోరారు. మొత్తం లక్ష మందితో సభ నిర్వహించేందుకు ప్లాన్ చేశారు. ఈ మేరకు పార్టీ శ్రేణులు జనసమీకరణలో నిమగ్నమయ్యారు. సింగరేణి కార్మికులు, టీబీజీకేఎస్ నాయకులు, కార్యకర్తలు డ్యూటీ డ్రెస్తో పాటు తట్టా, చెమ్మాస్, టోపీతో సభకు హాజరయ్యేందుకు సిద్ధమవుతున్నారు. కేసీఆర్ సభ నేపథ్యంలో పట్టణంలో భారీగా ఫ్లెక్సీలు, గులాబీ తోరణాలు వెలిశాయి.