పర్వతగిరి, మే 9: గిరిజన తండాలను అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని బీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని హట్యాతండా గ్రామ పంచాయతీలో ఐటీడీఏ నిధులు రూ.20 లక్షలతో చేపట్టిన జీపీ భవన నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గిరిజన తండాలను రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలుగా చేసి అభివృద్ధి చేస్తున్నదన్నారు. ప్రతి తండాలో సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్లు, మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికీ తాగు నీరు అందిస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్లు ఏకాంతంగౌడ్, శాంతిరతన్రావు, ఎంపీపీ కమల, జడ్పీటీసీ సింగ్లాల్, ఎంపీటీసీ లావణ్య, సర్పంచ్ నీలమ్మ-వెంకట్రాం, ఉపసర్పంచ్ అనురాధ-తిరుపతి, పీఏసీఎస్ చైర్మన్లు గొర్రె దేవేందర్, మనోజ్కుమార్గౌడ్, సర్వర్, రంగు కుమార్, జితేందర్రెడ్డి, చిన్నపాక శ్రీనివాస్, తహసీల్దార్ కోమీ, ఎంపీడీవో చక్రాల సంతోష్కుమార్, ఐటీడీఏ ఏఈ తిరుపతి, బీఆర్ఎస్ నాయకులు వంశీ, గోపాల్రావు, మాధవరావు, అశోక్, యుగేంధర్ పాల్గొన్నారు.
దుర్గామాతకు అరూరి పూజలు
మండలంలోని కొంకపాక శివారు సోమ్లాతండాలో దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే అరూరి రమేశ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఎంపీపీ కమల, జడ్పీటీసీ సింగ్లాల్, సర్పంచ్ వర్కాల రమేశ్, కర్మిల్ల మోహన్రావు, చిన్నపాక శ్రీనివాస్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ తక్కళ్లపెల్లి మధుసూదన్రావు, వివేక్, డాక్టర్ రాజశేఖర్, మాజీ సర్పంచ్ గోపగాని రాజుగౌడ్, తండావాసులు హరి, దేవా పాల్గొన్నారు.
బాధిత కుటుంబాలకు పరామర్శ
మండలంలోని దేవీలాల్తండాకు చెందిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జాటోత్ శ్రీనివాస్ తల్లి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా, బాధిత కుటుంబాన్ని ఎమ్మెల్యే అరూరి రమేశ్ పరామర్శించారు. నారాయణపురం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త గడ్డం నరహరి తల్లి మృతి చెందగా, అతడి కుటుంబ సభ్యులను, రోళ్లకల్ గ్రామానికి చెందిన కొండ్రాతి యాకయ్య ఇటీవల మృతి చెందగా అతడి కుటుంబాన్ని, రావూరు గ్రామానికి చెందిన బండి ఎల్లాగౌడ్ ఇటీవల తాటిచెట్టు పైనుంచి పడి మృతి చెందగా, బాధిత కుటుంబ సభ్యులను అరూరి పరామర్శించారు. ఎమ్మెల్యే వెంట జడ్పీటీసీ సింగ్లాల్, పీఏసీఎస్ చైర్మన్ మనోజ్కుమార్గౌడ్, మాజీ జడ్పీటీసీ మేడిశెట్టి రాములు, చింతపట్ల సోమేశ్వర్రావు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రంగు కుమార్గౌడ్, చిన్నపాక శ్రీనివాస్, నాయకులు ఎర్రబెల్లి వెంకటేశ్వర్రావు, కర్మిళ్ల దుర్గారావు ఉన్నారు.
రేణుకా ఎల్లమ్మ ఆలయంలో పూజలు
మడికొండ: గ్రేటర్ 44వ డివిజన్ కడిపికొండలో గౌడ సంఘం అధ్వర్యంలో రేణుకా ఎల్ల మ్మ, కంఠమహేశ్వరస్వామి ఉత్సవాల్లో ఎమ్మెల్యే అరూ రి రమేశ్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. కార్యక్రమంలో 45వ డివిజన్ కార్పొరేటర్ ఇండ్ల నాగేశ్వర్రావు, దర్గా సొసైటీ చైర్మన్ వనంరెడ్డి, మాజీ కార్పొరేటర్ శ్రీలేఖ, బీఆర్ఎస్ నాయకులు కృష్ణ, రజినీకర్, శాంతికుమార్, పూజారి శ్రీనివాస్శర్మ పాల్గొన్నారు.