హనుమకొండ చౌరస్తా, అక్టోబర్ 9 : పేదల పెన్నిధి సీఎం కేసీఆర్ అని ప్రభుత్వ చీఫ్ విప్, పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్భాసర్ అన్నారు. హనుమకొండ లష్కర్బజార్లోని బీసీ స్టడీ సరిల్లో బీసీ, మైనార్టీ బంధు లబ్ధిదారులకు సోమవారం చెక్కులు పంపిణీ చేశారు. 250 మంది బీలు, 80 మంది మైనార్టీ లబ్ధిదారులు రూ.లక్ష చెకులు అందుకున్నారు. ఈ సందర్భంగా వినయ్భాస్కర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పేదల పక్షపాతి అని, అన్ని వర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కట్టుబడి ఉన్నారన్నారు.
బీజేపీ, కాంగ్రెస్ పాలిస్తున్న ఏ రాష్ట్రాల్లోనూ రూ.2వేల పింఛన్ లేదన్నారు. కల్యాణలక్ష్మి షాదీ ముబారక్, దళిత బంధు, బీసీ బందు, మైనార్టీ బంధు అంటూ అనేక సంక్షేమ కార్యక్రమాలను తీసుకొచ్చిన ఘనత సీఎం కేసీఆర్కే దకుతుందన్నారు. వ్యవసాయ రంగం లో సీఎం కేసీఆర్ నాయకత్వంలో అనేక మార్పులు వచ్చాయన్నారు. కాళేశ్వరం, పాలమూరు, రంగారెడ్డి తదితర సాగునీటి ప్రాజెక్టులను నిర్మించినట్లు చెప్పారు. రూ.వేల కోట్ల నిధులతో 9 ఏండ్ల కాలంలో నగరవ్యాప్తంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మహ్మద్ అజీజ్ఖాన్, కార్పొరేటర్ వేముల శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ తాడిశెట్టి విద్యాసాగర్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నలుబోలు సతీశ్, పులి రజినీకాంత్, చీకటి ఆనంద్, మైనార్టీ ఈడీ శ్రీనివాస్, బీసీ ఈడీ రాంరెడ్డి పాల్గొన్నారు.
కాకతీయ యూనివర్సిటీ పీహెచ్డీ నియామకాల్లో అభ్యర్థులకు న్యాయం చేస్తానని చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. కేయూలో పీహెచ్డీ నియామకాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ పలువురు విద్యార్థులు ఎస్డీఎల్సీఈ వద్ద దీక్షలు చేపట్టగా వినయ్భాస్కర్ ఆ శిబిరాన్ని సోమవారం సందర్శించారు. అనంతరం దీక్ష చేస్తున్న వారితో మాట్లాడారు. సమస్య పై వెంటనే స్పందించి మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. విద్యార్థి ప్రతినిధులతో మాట్లా డి త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థుల కోరిక మేరకు ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి, వాకాటి కరుణతో కూడా మాట్లాడుతానని చెప్పారు. అనంతరం దీక్ష చేస్తున్న వారికి వినయ్భాస్కర్ నిమ్మరసం తాగించి విరమింపజేశారు. కార్యక్రమంలో ప్రొఫెసర్లు కూరపాటి వెంకటనారాయణ, సదానందం, రవీందర్, సంగాని మల్లేశం, ఇస్తారి, విద్యార్థి నాయకులు బైరపాక ప్రశాంత్, వీరస్వామి, తిరుపతి యాదవ్, వీరేందర్, బొట్ల మనోహర్, రాజు నాయక్, రాంబాబు, రాజేశ్, శంకర్, నాగరాజు, విజయ్కన్నా, రాకేశ్, కృష్ణ, పాషా, అంబాల కిరణ్, మేడ రంజిత్ పాల్గొన్నారు.
ఇటీవల నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రింట్ మీడియా వరింగ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్(టీపీఎండబ్ల్యూజేఏ) ప్రతినిధులు సోమవారం చీఫ్ విప్ దాస్యం వినయ్భాసర్ను కేయూ వద్ద మర్యాదపూర్వకంగా కలిసి సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ప్రింట్మీడియా విలేకరుల ఉనికి ప్రశ్నార్థకంగా మారిందని, వివిధ రాజకీయ నాయకుల సమావేశాల్లో వివక్షతకు గురవుతున్నామని పేర్కొన్నారు. ప్రెస్ కాన్ఫరెన్స్లో ప్రింట్మీడియాకు తగిన సౌకర్యాలు కల్పించాలని కోరారు. వినతిపత్రం అందజేసిన వారిలో అసోసియేషన్ కన్వీనర్ కొల్లా కృష్ణకుమార్, కోకన్వీనర్లు కంకణాల సంతోష్, కటూరి రవికుమార్, చింతల సత్యనారాయణ, ఊటుకూరి సాయిరాం, గౌరవ సలహాదారులు నాయకపు సుభాష్, బొల్లారం సదయ్య, జర్నలిస్టులు జగన్, ప్రశాంత్, అర్షం రాజ్కుమార్, డాక్టర్ పొడిశెట్టి విష్ణువర్ధన్, గుండెకుమార్ ఉన్నారు.