హనుమకొండ, సెప్టెంబర్ 5: ఈనెల 9న రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ హనుమకొండ నగరానికి వస్తున్నారని, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ తెలిపారు. మంగళవారం వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని పలు జంక్షన్లను మున్సిపల్ ఓఎస్డీ కృష్ణ, కుడా చైర్మన్ సంగంరెడ్డి సుందర్రాజ్ యాదవ్తో కలిసి పరిశీలించారు. రాత్రి వేళలో రోడ్లపై నిద్రించే వారి కోసం పునరావాస కేంద్రాలను నిర్మించేందుకు స్థలపరిశీలన చేశారు. ఈ సందర్భంగా చీఫ్ విప్ మాట్లాడుతూ ఈనెల 9న ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా కళాక్షేత్రాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారని అన్నారు. ఇప్పటికే 90శాతం పనులు పూర్తయ్యాయని, మిగతా 10శాతం పనులు 9వ తేదీ లోగా పూర్తవుతాయని చీఫ్ విప్ తెలిపారు.
మంత్రి కేటీఆర్ కాళోజీ కళాక్షేత్రంతోపాటు పలు అభివృద్ధి పనులకు సైతం శంకుస్థాపన చేయనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని జంక్షన్ల అభివృద్ధికి కృషి చేస్తోందని, సుందరీకరణలో భాగంగా వెడల్పు రోడ్లు, పచ్చదనం ఉట్టిపడేలా ఉద్యానవనాలతో ఒక్కో జంక్షన్ వద్ద ఒక్కో థీమ్తో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. రూ.3కోట్లతో 19 జంక్షన్లను అభివృద్ధి చేయడం జరుగుతుందని చీఫ్ విప్ తెలిపారు. ఒక వైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలతోపాటు సీఎం కేసీఆర్ నాయకత్వంలో మంత్రి కేటీఆర్ చొరవతో అన్నివర్గాల ప్రజలకు మౌలిక వసతులు, సదుపాయాలను కల్పించేందుకు పలు కార్యక్రమాలు చేయడం జంక్షన్లను పరిశీలించిన వారిలో గ్రంథాలయ చైర్మన్ అజీజ్ఖాన్, కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, బల్దియా డీఈ సంతోష్, ఈఈ రాజయ్య ఉన్నారు.