తొర్రూరు, నవంబర్ 13: బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ ఎన్నికల ప్ర చారంలో భాగంగా మంగళవారం పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరులో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభకు హాజరవుతున్నారు. బీఆర్ఎస్ పాలకుర్తి అభ్యర్థి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావును, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించి గెలిపించాలని ఓటర్లకు పిలుపునివ్వనున్నారు. తొర్రూరు నుంచి మహబూబాబాద్కు వెళ్లే రహదారిలో ఆర్యభట్ట హైస్కూల్కు ఎదురుగా ఉన్న 10 ఎకరాల స్థలంలో సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. సభలో మధ్యా హ్నం 2 గంటలకు సీఎం పాల్గొననున్నారు. నియోజకవర్గ పరిధిలోని 6 మండలాల నుంచి సుమారు లక్ష మంది సభలో పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. సభకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పా ట్లు చేశారు.
సుమారు 35 వేల నుంచి 40 వేల వరకు కుర్చీలు వేసి, భారీ షామియానాలతో కూడిన ఏర్పాట్లను చేపట్టారు. సీఎం కేసీఆర్ వస్తుండడంతో ప్రభుత్వం నుంచి పలు రకాల సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన వారంతా ఉత్సాహంగా తొర్రూరుకు తరలివచ్చేలా ఏర్పాట్లు చేసుకున్నారు. సంక్షేమ పథకాలకు తోడు ఎన్నికల మ్యానిఫెస్టోలో నూతనంగా ఇచ్చిన హామీలను సభకు హాజరయ్యే ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో ఫ్లెక్సీలను వివిధ రకాల ఆకృతులతో హోర్డింగ్లను ఏర్పాటు చేశారు. తొర్రూరు పట్టణమంతా గులాబీమయంగా మారింది. సభ వద్ద ఏర్పాట్లను మంత్రి దయాకర్రా వుతో పాటు బీఆర్ఎస్ నాయకులు పరిశీలించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో పాలకుర్తి నియోజకవర్గంలో జరిగిన కోట్లాది రూపాయల అభివృద్ధి పనులను మంత్రి దయాకర్రావు ప్రజలకు వివరించనున్నారు.