హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో అద్దె భవనాల్లో నడుస్తున్న అంగన్వాడీ కేంద్రాలను ప్రభుత్వ పాఠశాలల్లోకి తరలించాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ ఈ నవీన్ నికోలస్ ఆదేశించారు.
వీటిని తరలించేందుకు డీఈవోలు, ఎంఈవోలు సహకరించాలని ఆయన సూచించారు.