పరకాల, డిసెంబర్ 5: పంచాయతీ ఎన్నికల్లో కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి, బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సూచించారు. శుక్ర వారం పరకాల మండలం నాగారం గ్రామంలో ఏర్పాటుచేసిన మండలస్థాయి సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలన్నారు. బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులు గెలిస్తేనే రెండేళ్లుగా ఆగిపోయిన అభివృద్ధి మళ్లీ పరుగులు పెడుతుందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ పాలనలో గ్రామాలు అభివృద్ధిలో దూసుకెళ్లాయన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అది ఆగిపోయిందన్నారు. కాంగ్రె స్ ప్రభుత్వ మోసపూరిత 420 హామీలను ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలకు వివరించాలన్నారు. బీసీ డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేసిందని, ఆ పార్టీకి వారు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం మున్సిపాలిటీలకు, గ్రామ పంచాయతీలకు నిధు లు ఇవ్వకుండా నిర్వీర్యం చేసిందని, గ్రామాల్లో సెక్రటరీలు సైతం తప్పించుకొని తిరిగే పరిస్థితి నెలకొందన్నారు. గ్రామపంచాయతీల తోపాటు విద్య, వైద్యం, రోడ్లు దెబ్బతిన్నా సర్కారు పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
రైతులకు బోనస్, మద్దతు ధర ఇవ్వకపోగా, కనీసం వడ్లు కొనే దికులేదని, పింఛన్లు పెంచుతామని, విద్యార్థినులకు సూ టీలు ఇస్తామని, మహిళలకు నెలకు రూ. 2500 ఇవ్వలేదని, యువతకు ఉ ద్యోగాలు లేవని.. ఇలా ప్రతి రంగాన్ని నిర్వీర్యం చేసిందని విమర్శించారు. కేసీఆర్ చేసిన అభివృద్ధే గ్రామా ల్లో బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులను సర్పంచ్లుగా, వార్డుమెంబర్లుగా గెలిపిస్తాయన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చింతిరెడ్డి మధుసూదన్ రెడ్డి, సమన్వయ కమిటీ సభ్యులు చింతిరెడ్డి సాంబరెడ్డి, గురిజపల్లి ప్రకాశ్రావు, మునిగాల సురేందర్ రావు, గంట సమ్మిరెడ్డి, ఆముదాలపల్లి అశోక్, కోరే రమేశ్, మాజీ ఎంపీపీ దొణికెల మల్లయ్య, నాయకులు మేడిపల్లి శోభన్ తదితరులు పాల్గొన్నారు.