వరంగల్ : ఉపాధి హామీ పథకం అమలుపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తుందని వరంగల్ జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో సభ్యులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడానికి, కూలీల పొట్టకొట్టేందుకు కేంద్రం ఇటీవల ఓ సర్క్యులర్ జారీ చేసింది.
అది కూలీలను అవమాన పరచడమేనని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. ఉపాధి హామీ పథకం అమలుపై కేంద్రం జారీ చేసిన సర్క్యులర్ రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సభ్యులందరూ కేంద్రం తీరుపై నిరసన తెలిపారు.
ఈ నేపథ్యంలో ఉపాధి హామీ పథకం అమలుపై కేంద్రం తీరుపై తెలుపుతూ ఇటీవల జారీచేసిన సర్క్యులర్ రద్దు చేయాలని సర్వ సభ్య సమావేశం ఏకగ్రీవ తీర్మానం ఆమోదించింది. ఈ తీర్మానం ప్రభుత్వానికి పంపించనున్నట్లు సమావేశానికి అధ్యక్షత వహించిన జెడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి ప్రకటించారు.