వరంగల్ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జీఎస్టీని పెంచి పేదల ప్రాణాలతో చెలగాటమాడుతున్నదని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ అన్నారు.
కేంద్రం విధానం వల్ల పాలు, పాల ఉత్పత్తి ఉపకరణాల ధరలు పెరగడంపై నిరసనలు చేపట్టాలని టీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది.
అందులో భాగంగా వర్ధన్నపేట మండలం ఇల్లంద వ్యవసాయ మార్కెట్ వద్ద వరంగల్ – ఖమ్మం జాతీయ రహదారిపై చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రజావ్యతిరేక పార్టీ అన్నారు.
పేదలను ముంచుతూ కార్పొరేట్ శక్తులకు దేశ సందపను కట్టబెడుతున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.