రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు ఉమ్మడి వరంగల్లో వైభవంగా కొనసాగుతున్నాయి. బుధవారం తెలంగాణ వైద్య ఆరోగ్య దినోత్సవాన్ని ప్రజాప్రతినిధులతో కలిసి వైద్యులు, సిబ్బంది సంబురంగా జరుపుకొన్నారు. ఆయాచోట్ల మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్, ఎంపీలు కవిత, దయాకర్, ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, నన్నపునేని నరేందర్, చల్లా ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్రెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, రెడ్యానాయక్, శంకర్నాయక్, రాజయ్య, యాదగిరిరెడ్డి, మేయర్ సుధారాణి, కలెక్టర్లు, ఎమ్మెల్సీలు, జడ్పీ అధ్యక్షులు హాజరై గర్భిణులు, బాలింతలకు న్యూట్రిషన్ కిట్లు, కేసీఆర్ కిట్లు పంపిణీ చేశారు. అలాగే ఏఎన్ఎంలకు బీపీ మిషన్లు, చీరలు అందించారు. అనంతరం ఉత్తమ వైద్యులు, సిబ్బందిని ఘనంగా సన్మానించారు.
ఉత్సవాల నేపథ్యంలో ప్రజలు తీసుకోవాల్సిన ఆరోగ్య జాగ్రత్తలు తెలుపుతూ ర్యాలీలు నిర్వహించారు. డప్పుచప్పుళ్లు, కళాకారుల ఆటపాటల నడుమ బతుకమ్మలతో వైద్యులు, సిబ్బంది ప్లకార్డులు ప్రదర్శిస్తూ ముందుకుసాగారు. అలాగే వేదికలపై చిన్నారులు, వైద్య విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. మహబూబాబాద్లో లంబాడా, గుస్సాడీల సంప్రదాయ నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
– నమస్తే తెలంగాణ నెట్వర్క్