హసన్పర్తి, మార్చి 18: వ్యభిచారం చేయాలని బెదిరించిన వారిపై హసన్పర్తి పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. సీఐ సురేశ్ కథనం ప్రకారం.. జోగుళాంబ గద్వాల జిల్లాకు చెందిన యువతి(22) హైదరాబాద్లోని ఓ కంపెనీలో పనిచేస్తున్నది. ఈ నెల 10న ఉదయం 11గంటలకు హైదరాబాద్ ఎంజీబీఎస్లో బస్సు దిగింది. అప్పటికే ఒంటరి అమ్మాయిల కోసం కాపుకాస్తున్న ఇద్దరు బాలికలు సదరు యువతికి మాయమాటలు చెప్పి ఇబ్రహీంపట్నంలోని తమ ఇంటికి తీసుకెళ్లి తల్లికి అప్పగించారు.
రెండు రోజుల తర్వాత బ్రోకర్ల ద్వారా ఈ నెల 13న కారులో యువతిని వంగపహాడ్లో ఓ ఇంట్లో బంధించి వ్యభిచారం చేయాలని బలవంతం చేశారు. మరుసటి రోజు ఉదయం 7గంటలకు ఆమె తప్పించుకొని పోలీస్స్టేషన్కు వెళ్లింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు 17న కేసు నమోదు చేసిన పోలీసులు ఇబ్రహీంపట్నం మహిళల నుంచి యువతి బ్యాగ్, సెల్ఫోన్, రూ.2వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వంగపహాడ్లో ఇద్దరు మహిళలను అదుపులోని తీసుకొని దర్యాఫ్తు చేస్తున్నట్లు సీఐ వెల్లడించారు.