స్వాతంత్య్రం సిద్ధించిన 75 ఏళ్లలోనూ అభివృద్ధికి అమడ దూరంలో ఉన్న భారతదేశ గతిని మార్చాలనే సంకల్పంతోనే తెలంగాణ ఉద్యమ నేత, సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేసి జాతీయ పార్టీలతో పోరాటాలకు శ్రీకారం చుట్టారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు.
ఖమ్మం సభతో ప్రతిపక్షాల కళ్లు బైర్లుకమ్మాలే..
కార్యకర్తలు, ప్రజలు వేలాదిగా తరలిరావాలి
పంచాయతీరాజ్ శాఖ మంత్రి దయాకర్రావు
రైతు సంక్షేమ రాజ్య నిర్మాణమే సీఎం కేసీఆర్ ధ్యేయం : ఎమ్మెల్సీ కడియం శ్రీహరి
రాయపర్తిలో బీఆర్ఎస్ మండల విస్తృత స్థాయి సమావేశం
పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం
పీడల నివారణకు పాత వస్తువుల ఆహుతి భోగిపండ్లతో చిన్నారులకు దిష్టి రేపు సంక్రాంతి, ఎల్లుండి కనుము రంగవల్లులతో కళకళలాడనున్న వాకిళ్ల పలుచోట్ల గోదారంగనాథుల కల్యాణానికి ఏర్పాట్లు పుడమిపుత్రుల పండుగ.. రానేవచ్చింది. నేడు భోగి, రేపు మకర సంక్రాంతి, ఎల్లుండి ‘కనుము’ను కన్నుల పండువగా జరుపుకొనేందుకు ప్రజానీకం సిద్ధమైంది. సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి అడుగిడే సంక్రాంతికి ముందు రోజున ఇంట్లో పాతవస్తువులు భోగి మంటల్లో వేస్తే పీడ తొలుగుతుందని, చిన్నారులకు భోగిపండ్లు పోసి దిష్టి తీస్తే ఆయురారోగ్యాలతో ఉంటారని ప్రతీతి.
– పోచమ్మమైదాన్
రాయపర్తి, జనవరి 13 : స్వాతంత్య్రం సిద్ధించిన 75 ఏళ్లలోనూ అభివృద్ధికి అమడ దూరంలో ఉన్న భారతదేశ గతిని మార్చాలనే సంకల్పంతోనే తెలంగాణ ఉద్యమ నేత, సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేసి జాతీయ పార్టీలతో పోరాటాలకు శ్రీకారం చుట్టారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. మండలంలోని కిష్టాపురం క్రాస్ రోడ్డులోని వీఆర్ గార్డెన్స్లో శుక్రవారం బీఆర్ఎస్ మం డల అధ్యక్షుడు మునావత్ నర్సింహానాయక్ అధ్యక్షతన జరిగిన మండల విస్తృత స్థాయి సమావేశానికి ఎమ్మెల్సీ కడియం శ్రీహరితో కలసి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ ఘన చరిత్ర కలిగిన పాలకుర్తి నియోజక వర్గ కేంద్రంతోపాటు నియోజక వర్గంలోని మండలాలు, గ్రామాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నట్లు చెప్పారు.
సీఎం కేసీఆర్ అండదండలతో నియోజక వర్గంలోని ఆలయాలను అభివృద్ధి చేస్తున్నానని వివరించారు. బీఆర్ఎస్ పార్టీ ప్రకటనతో రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలతోపాటు దేశంలోని జాతీయ పార్టీల వెన్నులో వణుకు పుట్టిందన్నారు. ఈ నెల 18న ఖమ్మం జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న బీఆర్ఎస్ బహిరంగ సభపై దేశంలోని రాజకీయ పార్టీలు ఆసక్తిగా చూస్తున్నాయన్నారు. ఖమ్మం సభకు మండలంలోని 39 గ్రామా ల ప్రజలంతా పార్టీలకు అతీతంగా తరలి వచ్చి విజయవంతం చేయాలని ఆయన కోరారు.
రైతు సంక్షేమమే సీఎం ధ్యేయం : ఎమ్మెల్సీ కడియం
దేశాన్ని రైతు సంక్షేమ రాజ్యంగా తీర్చిదిద్ధాలన్నదే సీఎం కేసీఆర్ ధ్యేయమని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి తెలిపారు. ఎనిమిదేళ్ల కాలంలోనే అభివృద్ధిలో దేశంలోనే అగ్రగ్రామిగా నిలిచిన తెలంగాణ రాష్ట్ర మోడల్ను దేశవ్యాప్తంగా పరిచయం చేసేందుకు కృషి చేస్తున్నారని చెప్పారు. ఖమ్మంలో జరిగే బహిరంగ సభకు అన్ని గ్రామాల నుంచి తెలంగాణవాదులు, ప్రజలు, పార్టీ శ్రేణులు, ప్రజా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని ఆయన కోరారు.
ఈ సమావేశంలో ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జడ్పీటీసీ రంగు కుమార్, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ ఆకుల సురేందర్రావు, బీఆర్ఎస్ మండల ఇన్చార్జి అనుమాండ్ల దేవేందర్రెడ్డి, నాయకులు పూస మధు, ఎండీ నయీం, గబ్బెట బాబు, గారె నర్సయ్య, మందాడి సుదర్శన్రెడ్డి, కుం దూరు రాంచంద్రారెడ్డి, గారె నర్సయ్య, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు రెంటాల గోవర్ధన్రెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు అయిత రాంచందర్, ఇల్లంద మార్కెట్ డైరెక్టర్లు వల్లపు వెంకటేశ్వర్లు, ఎండీ ఉస్మాన్, కుందూరు యాదగిరిరెడ్డి, తోట సుదర్శన్, గుండె రామస్వామి, దొమ్మాటి సుభాష్ తదితరులు పాల్గొన్నారు.