వరంగల్, మార్చి 25(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఈ నెల 31న బీఆర్ఎస్ వరంగల్ లోక్సభ ఎన్నికల సన్నాహక సమావేశం జరుగనున్నది. మడికొండలోని సత్యసాయి కన్వెన్షన్లో జరిగే ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. వరంగల్ పశ్చిమ, వరంగల్ తూర్పు, వర్ధన్నపేట, పరకాల, స్టేషన్ఘన్పూర్, పాలకుర్తి, భూపాలపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్చార్జీలు, బీఆర్ఎస్ ముఖ్య నేతలు, కార్యకర్తలు ఈ సన్నాహక సమావేశంలో పాల్గొంటారు.