పరకాల, నవంబర్ 16 : రానున్న ఎన్నికల్లో విపక్షాలు గల్లంతు కావడం ఖాయమని, మూడోసారి విజయం బీఆర్ఎస్దేనని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మండలంలోని పైడిపల్లి, నాగారం, వెల్లంపల్లి గ్రామాల్లో ఎంపీ దయాకర్తో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొట్లాడి సా ధించుకున్న తెలంగాణ రాష్ట్రం సీఎం కేసీఆర్ ఆ ధ్వర్యంలో దేశానికే మార్గదర్శకంగా మారిందన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలతో పేద ప్రజల జీవన ప్రమాణాలు మెరుగై అభివృద్ధి సాధిస్తున్నారని చెప్పారు. రైతుబంధు, రైతు బీమా, వ్యవసాయానికి 24గంటల ఉచిత కరెంటు, ప్రతి ఎకరాకు సాగునీరు అందించడంతో రాష్ట్రంలో పంటల దిగుబడులు గణనీయంగా పెరిగిందన్నారు.
కానీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే స్కాంల ప్రభుత్వంగా మారుతుందని, ప్రజలను పట్టించుకునే వారు ఉండరన్నారు. రానున్న ఎన్నికల్లో విపక్షాలు గల్లంతు కావడం ఖాయమని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్కే గ్యారెంటీ లేదని, కాని ఆ పార్టీ గ్యారెంటీ స్కీంల పేరుతో ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నదన్నారు. అనంతరం ఎంపీ మా ట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. సీఎంగా కేసీఆర్ అయితేనే రాష్ట్రం మరింత అభివృద్ధి సాధిస్తుందన్నారు. బీఆర్ఎస్ మ్యానిపెస్టో అన్ని వర్గాలకు సంక్షేమం, లబ్ధి సీఎం కేసీఆర్ రూపొందించారన్నారు.
ప్రజలు విపక్షాలను నమ్మి మోసపోవద్దన్నారు. 60 ఏండ్లు పాలించిన కాంగ్రెస్ నాయకులు తెలంగాణ గడ్డను దోచుకున్నారని విమర్శించారు. రాష్ట్రంపై విషం కక్కుతూ మతం పేరుతో బీజేపీ నాయకులు పచ్చన తెలంగాణలో ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీకీ స్థానం లేదని, అభివృద్ధి చేసిన బీఆర్ఎస్నే ప్రజలు గెలిపించాలన్నారు. కార్యక్రమంలో మండలాధ్యక్షుడు చింతిరెడ్డి మధుసూదన్ రెడ్డి, నాయకులు చింతిరెడ్డి సాంబరెడ్డి, నేతాని శ్రీనివాస్రెడ్డి, ఆముదాలపల్లి అశోక్, కోరె రమేశ్, గంట సమ్మిరెడ్డి, బొజ్జం రమేశ్ పాల్గొన్నారు.