చిల్పూరు, సెప్టెంబర్ 26 : కర్ణాటక రాష్ట్రంలో ఇచ్చిన హామీలు అమలు చేయని కాంగ్రెస్ నేతలు అవే హామీలను తెలంగాణలో ప్రచారం చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని బీఆర్ఎస్ స్టేషన్ఘనపూర్ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. మంగళవారం మండలం కేం ద్రంలోని బుగులు వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఆలయ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్రావుతో కలిసి దర్శించుకున్నారు. అనంతరం చిల్పూరు, చిన్నపెండ్యాలలో మాచర్లస్వామి, ఇల్లందుల హరిబాబు అధ్యక్షతన నిర్వహించిన వేర్వేరు ఆత్మీయ సమ్మేళనాల్లో జడ్పీ చైర్మన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు పాగాల సంపత్రెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు.
ఎన్నికలు సమీపించిన తరుణంలో ఆచరణయోగ్యంకాని హామీలిస్తున్న కాంగ్రెస్ నేతలను ప్రజలు నమ్మరని శ్రీహరి స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ను భారీ మెజార్టీతో గెలిపించాలని శ్రీహరి కోరారు. కొత్తగా ఏర్పడిన చిల్పూరు మండలాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసేలా కృషి చేస్తానన్నారు. బుగులు వేంకటేశ్వరస్వామి ఆలయ అభివృద్ధికి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారం తీసుకుని తనవంతు సహకారం అందిస్తానన్నారు.
బీఆర్ఎస్ పాలనలోనే స్టేషన్ఘనపూర్ నియోజకవర్గం సస్యశ్యామలం అయ్యిందని, బీడు భూములకు సాగునీరు అందిందని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసేందుకు సీఎం కేసీఆర్ అవకాశం కల్పించారన్నారు. సహకారంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని, ఇందుకు తనను ఆశీర్వదించాలని కోరారు. అనంతరం కాంగ్రెస్ మాజీ ఎంపీటీసీ పెండ్యాల ఉపేందర్రావు కడియం శ్రీహరి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో చిల్పూరు ఆలయ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్రావు, ఎంపీపీ బొమ్మిశెట్టి సరితాబాలరాజు, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు మామిడాల లింగారెడ్డి, సర్పంచ్ ఉద్దెమారి రాజ్కుమార్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రమేశ్నాయక్ పాల్గొన్నారు.