స్టేషన్ ఘన్పూర్, నవంబర్ 7 : అభివృద్ధిలో తెలంగాణ నంబర్వన్గా నిలిచిందని స్టేషన్ఘన్పూర్ బీఆర్ఎస్ అభ్యర్థ్ది, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని తానేధార్పల్లి, విశ్వనాథపురం, నమిలిగొండ, పాంనూర్, చాగల్లు, రాఘవాపూర్ గ్రామాల్లో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. గ్రామాలకు వచ్చిన కడియం శ్రీహరికి గ్రామస్తులు అధిక సంఖ్యలో హాజరై అపూర్వ స్వాగతం పలికారు. గ్రామాల్లో గ్రామ అధ్యక్షుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశాలకు కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఆదాయం పెరిగిందని, పెరిగిన ఆదాయాన్ని ప్రజలకు అందించాలనే లక్ష్యంతో బడుగు, బలహీణ వర్గాలను దృష్టిలో పెట్టుకుని సీఎం కేసీఆర్ ఎన్నికల మ్యానిఫెస్టోను రూపొందించారని తెలిపారు. అంతే కాకుండా నియోజకవర్గానికి అదనంగా వెయ్యి దళిత బంధు, అదనంగా మరో మూడు వేల గృహలక్ష్మి ఇండ్లు ఇస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని, వాటి ద్వారా నియోజకవర్గంలో అధికంగా పథకాలు అందించి ఆదుకుంటానని కడియం శ్రీహరి తెలిపారు. కరెంట్, సాగు, తాగు నీటి కష్టాలను పోగొట్టి సంక్షేమ పథకాలను అందిస్తూ అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటున్న బీఆర్ఎస్కు అండగా నిలవాలని ఆయన కోరారు. ఈ నియోజకవర్గ ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదంతోనే ముప్పై ఏళ్లుగా రాజకీయంలో ఉంటూ ఉమ్మడి రాష్ట్రంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాను కానీ, మీకు తలవంపులు తెచ్చేలా ఎన్నడూ పనిచేయలేదన్నారు., శాయశక్తుల నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశానన్నారు. మళ్లీ ఆశీర్వదిస్తే ఐదేళ్లు అందుబాటులో ఉంటూ మీకు సేవ చేసుకుంటానన్నారు.
రేవంత్ రెడ్డి సంతకంతో ప్రకటించిన కాంగ్రెస్ మ్యానిఫెస్టో కంటే.. బీఆర్ఎస్ మ్యానిఫెస్టో అద్భుతంగా ఉందని కడియం శ్రీహరి పేర్కొన్నారు. ఈ సమావేశంలో జడ్పీ చైర్మన్ సంపత్ రెడ్డి, కందుల రేఖాగట్టయ్య, జిల్లా నాయకులు నరేందర్ రెడ్డి, బెలిదె వెంకన్న, మండల పార్టీ అధ్యక్షుడు మాచర్ల గణేశ్, మార్కెట్ వైస్ చైర్మన్ చల్లా చందర్ రెడ్డి, ఆకుల కుమార్, రైతు బంధు సమితి సభ్యులు తోట వెంకన్న, సొసైటీ డైరెక్టర్ చట్ల యాకయ్య, తోట సత్యం, సర్పంచ్లు గాదే చంద్రయ్య, తాటికొండ సురేశ్ కుమా ర్, అనుమాల మల్లేశం, ఉప్పలస్వామి, రేణుకారాము లు, పోగుల సారంగపాణి, ఎంపీటీసీలు రజాక్యాదవ్, లలితా శ్రీనివాస్, గన్ను నర్సింహులు, గుర్రం రాజు, గ్రామ అధ్యక్షుడు రాజిరెడ్డి, కే హరికృష్ణ, నర్సింహ, మండల ప్రచార కార్యదర్శి ప్రభాకర్, మాజీ మండలాధ్యక్షుడు గట్టు రమేశ్, చేపూరి వినోద్, మాచర్ల కుమారస్వామి, మాచర్ల రఘురాములు, గట్టు చేరాలు, కనకం రమేశ్, పల్లె రవీందర్ పాల్గొన్నారు.