పరకాల, జనవరి 17 : దేశంలో మత విద్వేషాలను రెచ్చగొట్టి ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్న బీజేపీకి బు ద్ది చెప్పాలని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని నడికూడ మండలం సర్వాపూర్, పులిగిళ్ల, నర్సక్కపల్లి, వరికోల్, రాయపర్తి, నార్లాపూర్ గ్రామాల బీఆర్ఎస్ ముఖ్యకార్యకర్తల సమావేశాన్ని శాయంపేట మండలం ప్రగతి సింగారం గ్రామంలో నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో నెలకొన్న పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీని బలోపేతం చేయడంలో పార్టీ ముఖ్య కార్యకర్తలు కీలక పాత్ర పోషించాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేస్తున్న సంక్షేమపథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వారికి అవగాహన కల్పించాలని సూచించారు. పార్టీని బలోపేతం చేయడంతో కార్యకర్తలే కీలకమన్నారు. బీఆర్ఎస్పై విపక్ష పార్టీలు చేస్తున్న విమర్శలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని, విమర్శలకు ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ చందా కుమారస్వామి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు డీ చంద్రమౌళి, రైతుబంధు సమితి జిల్లా కో ఆర్డినేటర్ బొల్లె భిక్షపతి, మాజీ జడ్పీటీసీ పాడి కల్పనాదేవి, నాయకులు నందికొండ గణపతి రెడ్డి, పాడి ప్రతాప్ రెడ్డి, మచ్చ రవీందర్, అనిల్ పాల్గొన్నారు.