నర్సంపేటరూరల్, అక్టోబర్ 31: రాష్ట్రంలో సంక్షేమ పాలన బీఆర్ఎస్కే సాధ్యమని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మంగళవారం కాంగ్రెస్ పార్టీ నుంచి ఇటుకాలపల్లికి చెందిన 15 కుటుంబాలు పెద్ది సమక్షంలో బీఆర్ఎస్లో చేరాయి. ఈ సందర్భంగా వల్లాల స్వామి, బుర్ర కొంరెల్లి, వీరస్వామి, కుమారస్వామి, శివకుమార్, అశోక్, ప్రభాకర్, స్వామి, ఈదునూరి కుమారస్వామి, దామెర స్వామి, బుర్ర రాములు, దొనికెల రమేశ్, బుర్ర శ్యామ్తోపాటు మరికొందరికి పెద్ది గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రకటించిన మ్యానిఫెస్టో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంటున్నదన్నారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలకు ప్రపంచ దేశాలు ఫిదా అవుతున్నట్లు చెప్పారు. సీఎం కేసీఆర్ సహకారంతో నర్సంపేట నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలు మరోసారి ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నామాల సత్యనారాయణ, సర్పంచ్ మండల రవీందర్, ఎంపీటీసీ భూక్యా వీరన్న, ఉప సర్పంచ్ జమాండ్ల చంద్రమౌళి, బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు పిట్టల శ్రీనివాస్, కార్యదర్శి దొరికెల కుమార్, క్లస్టర్ బాధ్యులు కడారి కుమారస్వామి, మచ్చిక నర్సయ్యగౌడ్, టీ రాంప్రసాద్, నాయకులు లకిడె రాజేశ్వర్రావు, హరీశ్, వినయ్ పాల్గొన్నారు.
భాంజీపేటలో కాంగ్రెస్, బీజేపీకి చెందిన 30 కుటుంబాలు పెద్ది సమక్షంలో పట్టణంలో బీఆర్ఎస్లో చేరాయి. గ్రామానికి చెందిన ఆరెల్లి మొగిలి, దూపటి ప్రభాకర్, ఆరెల్లి బాలయ్య, ఆరెల్లి రాజేందర్, కక్కర్ల శ్రీను, ఆరెల్లి వీరస్వామి, ఆరెల్లి మల్లికార్జున్, ఆరెల్లి కుమారస్వామి, పెరుమాండ్ల వెంకటేశ్వర్లు, ఆరెల్లి సురేందర్, పెరుమాండ్ల యాదగిరి, పెరుమాండ్ల రాజన్న, బైరి భిక్షపతి, దూపటి సుమన్, పెరుమాండ్ల రమేశ్, దూపటి మధుకర్, పొగాకుల రాంబాబు, దూపటి యుగేంధర్, పొగాకుల నాగరాజు, ఆరెల్లి నవీన్, చింత ప్రవీణ్, తాళ్లపెల్లి రాజు, చింత నవీన్, చింత సాంబయ్య, దూపటి బుచ్చయ్య, ఆరెల్లి శివకృష్ణ, కక్కెర్ల శివ, బైరి యశ్వంత్, ఆరెల్లి రమేశ్తోపాటు మరికొంత మంది బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో క్లస్టర్ ఇన్చార్జీలు నర్సయ్య, రాప్రసాద్, కట్ల సుదర్శన్రెడ్డి, రాజన్న పాల్గొన్నారు.
ఖానాపురం: పాకాలకు గోదావరి జలాలు తీసుకురావడంతో తన జన్మ సార్థకమైందని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. కొత్తూరుకు చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు పెద్ది సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. నియోజకవర్గ అభివృద్ధిని చూసి ఆకర్షితులై పార్టీలో స్వచ్ఛందంగా చేరుతున్నారని ఎమ్మెల్యే అన్నారు. పార్టీలో చేరిన వారందరికీ సముచిత స్థానం కల్పిస్తానన్నారు. పార్టీలో చేరిన వారిలో జాటోత్ రాజేందర్, జా టోత్ రాయుడు, బానోత్ శ్రీను, ఆంగోత్ రాజు, అజ్మీరా యాకూబ్తోపాటు మరో 20 మంది ఉన్నారు. అలాగే, మండలకేంద్రంలోని టేకులతండాకు చెందిన పలువురు యువకులు ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్రావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. పార్టీల చేరిన వారిలో బోడ శ్రీకాంత్, కొ ర్ర రాజ్కుమార్, భూక్యా రాజ్కుమార్, సంతోష్, బోడ అనిల్, అజ్మీరా రాజు, ఆంగోత్ రాజు, మాలోత్ విజేందర్, భూక్యా నరేశ్, పాలకుర్తి నాగరాజు, బోడ రాజేశ్, జర్పుల నాగన్న, భూక్యా నందతోపాటు మరో 30 మంది ఉన్నారు. కార్యక్రమంలో బత్తిని శ్రీనివాస్గౌడ్, బూస అశోక్, సదర్లాల్, బాలు, దాసరి రమేశ్, బోడ పూలు, ఉప్పు రాజు, దేవినేని వేణుకృష్ణ పాల్గొన్నారు.
దుగ్గొండి: సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీల వారు బీఆర్ఎస్లో భారీగా చేరుతున్నారని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. మహ్మదాపురం గ్రామానికి చెందిన పదిమంది కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ది సమక్షంలో పార్టీలో చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మల్లంపల్లి నాయకులు బూర హేమచంద్గౌడ్, బైరి లలితా రమణారెడ్డి, తడక కొమురయ్య, క్లస్టర్ ఇన్చార్జీలు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అలాగే, మండలంలోని పీజీతండాలో కాంగ్రెస్తోపాటు ఇతర పార్టీల నుంచి సుమారుగా 50 కుటుంబాలు పెద్ది సమక్షంలో బీఆర్ఎస్లో చేరాయి.
నెక్కొండ: బీఆర్ఎస్ యువతకు పెద్దపీట వేసిందని ఎమ్మెల్యే పెద్ది అన్నారు. అమీన్పేటకు చెందిన యూత్ సభ్యులు ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా పెద్ది మాట్లాడుతూ యువతకు బీఆర్ఎస్ సర్కారు యువతకు పెద్దఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించిందన్నారు. యూత్ అధ్యక్షుడు గుర్రం శ్రీధర్, చిలుపూరి మధు, వల్లె రవి, చిలుపూరి రాజు, చిలుపూరి ప్రశాంత్, కాడబోయిన ప్రశాంత్, వల్లె రాజు, చిలుపూరి సుధాకర్, రేవుల సాహిత్, రాగిరి శ్రవణ్ బీఆర్ఎస్లో చేరిన వారిలో ఉన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సంగని సూరయ్య, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి కొమ్ము రమేశ్యాదవ్ పాల్గొన్నారు. అలాగే, చిన్నకోర్పోలుకు చెందిన ఉప సర్పంచ్ ధర్మావత్ చంద్యా జెడ్పీ ఫ్లోర్లీడర్ పెద్ది స్వప్న సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
నల్లబెల్లి: బీఆర్ఎస్ ధాటికి ప్రతిపక్షాలు పారిపోతున్నామని ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి ఎద్దేవా చేశారు. రుద్రగూడెంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన 20 కుటుంబాలు ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్ చేరాయి. పార్టీలో చేరిన వారిలో గుండెబోయిన కుమార్, ఈర్ల రామ్మూర్తి, నాగరాజు, మేరుగు రవితేజ, కొత్తగట్టు శ్రీనుతోపాటు మరికొంతమంది ఉన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బానోత్ సారంగపాణి, మండల ఎన్నికల ఇన్చార్జి చెట్టుపెల్లి మురళీధర్రావు, పార్టీ మాజీ మండల అధ్యక్షుడు ఊడుగుల ప్రవీణ్గౌడ్, ప్రధాన కార్యదర్శి కోటిలింగాచారి, క్లస్టర్ ఇన్చార్జీలు గందె శ్రీనివాస్గుప్తా, ఇంగ్లి శివాజీ, అంబరగొండ రాజు పాల్గొన్నారు.