హనుమకొండ, మార్చి 6 : అబద్ధాల కోరు.. అడ్డగోలు హామీలు ఇచ్చిన కాంగ్రెస్ సర్కార్పై బీఆర్ఎస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఎల్ఆర్ఎస్ విషయంలో ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నదని మండిపడ్డారు. బీఆర్ఎస్ అధిష్ఠానం, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజక వర్గాల్లో బుధవారం ధర్నా చేశారు. వరంగల్ పశ్చిమ నియోజక వర్గం పరిధిలో బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ అధ్యక్షతన జరిగిన ధర్నాలో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఇతర నాయకులు హాజరయ్యారు. కాంగ్రెస్కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ధర్నాను ఉద్దేశించి ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య మాట్లాడుతూ ఎల్ఆర్ఎస్ విషయంలో కాంగ్రెస్ పార్టీ తీరు మార్చుకోవాలన్నారు. ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేయకుంటే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ నా డు ఎల్ఆర్ఎస్ ఉచితమని చెప్పి, ఇప్పుడు ఫీజు కట్టమని కాంగ్రెస్ అంటుందని మండిపడ్డారు. అమలుకాని, ఉచిత హామీలతో కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. పేద, మధ్య తరగతి కుటుంబాలపై పెను భారం మోపి రూ.20వేల కోట్లు వసూళ్లకు పాల్పడడం సిగ్గుచేటన్నారు.
ఆరు గ్యారెంటీలు అమలు చేసే వరకూ కొట్లాడుతామన్నారు. అలాగే, బాలసముద్రంలోని నిర్మించిన పార్టీ కార్యాలయం గురించి మాట్లాడుతూ పార్టీ ఆఫీస్ను చట్టబద్ధంగా నిర్మించామని, దాని జోలికి రావొద్దన్నారు. ఎల్ఆర్ఎస్ విషయంలో నేడు కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లకు వినతి పత్రాలు అందజేయనున్నట్లు వినయ్ భాస్కర్ తెలిపారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం మధ్యాహ్నం జిల్లా పార్టీ కార్యాలయంలో వేడుకలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కుడా మాజీ చైర్మన్లు సుందర్ రాజ్ యాదవ్, మర్రి యాదవ్రెడ్డి, పశ్చిమ నియోజకవర్గ కోఆర్డినేటర్ జనార్దన్ గౌడ్, సల్వాజి రవీందర్రావు, కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
వరంగల్ చౌరస్తా: అబద్ధాలు, మోసపూరిత హామీల పునాదులపై కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగుతున్న విషయాన్ని ప్రజలు గుర్తిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. నన్నపునేని ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకులు, కార్యకర్తలతో వరంగల్ చౌరస్తాలో ఎల్ఆర్ఎస్ ఫీజుకు వ్యతిరేకంగా మహాధర్నా నిర్వహించారు. ఎల్ఆర్ఎస్ పథకాన్ని అడ్డుగా పెట్టుకొని ప్రజల నుంచి రూ. 20 వేల కోట్లు దోచుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్ మసూద్, కార్పొరేటర్లు గందె కల్పన, వీ సువర్ణ, మరుపల్ల రవి, సిద్దం రాజు, పల్లం పద్మ, నాయకులు పల్లం రవి, మసూద్, బజ్జూరి వాసు పాల్గొన్నారు.
వర్ధన్నపేట : కాంగ్రెస్ గత ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం ఎలాంటి రుసుం లేకుండా ఎల్ఆర్ఎస్ అమలు చేయాలని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు అరూరి రమేశ్ డిమాండ్ చేశారు. బుధవారం నియోజకవర్గ కేంద్రాల్లో బీఆర్ఎస్ శ్రేణులు ధర్నా, రాస్తారోకో నిర్వహించాయి. వర్ధన్నపేట నియోజకవర్గ కేం ద్రంలో ఆయన పార్టీ శ్రేణులతో కలిసి ధర్నాలో పాల్గొన్నారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో అధికారులకు విన తిపత్రం అందించారు. ఈ సందర్భంగా అరూరి మాట్లా డుతూ ఎల్ఆర్ఎస్ను ఎలాంటి ఫీజు లేకుండా ఉచితంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ అన్నమనేని అప్పారావు, జడ్పీటీసీ మార్గం భిక్షపతి, బీఆర్ఎస్ నాయకులు రాకేశ్రెడ్డి, మండల అధ్యక్షుడు తూళ్ల కుమారస్వామి, పులి శ్రీనివాస్, పర్వతగిరి, ఐనవోలు, వర్ధన్నపేట మండలాల నాయకులు పాల్గొన్నారు.
నర్సంపేట: పేదల భూములను ఉచితంగా క్రమబద్ధీకరించాలని, ఎన్నికల్లో ఎల్ఆర్ఎస్ను ఉచితంగా చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు మాట మార్చడం తగదని బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు నాగెల్లి వెంకటనారాయణగౌడ్ అన్నారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నర్సంపేట మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి అధికారులకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు డాక్టర్ లెక్కల విద్యాసాగర్రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ ఎం వెంకట్రెడ్డి, బండి రమే శ్, బీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజు, కౌన్సిలర్లు నాగిశెట్టి పద్మా ప్రసాద్, దేవోజు తిరుమలా సదానందం, గందె రజితా చంద్రమౌళి, రామసహాయం శ్రీదేవీ సుధాకర్రెడ్డి, గంప రాజేశ్వర్గౌడ్, కార్యదర్శి వెన్నముద్దల శ్రీధర్రెడ్డి, రావుల సతీశ్, బీరం నాగిరెడ్డి, పెండ్యాల యాదగిరి, చుక్క అనిల్ పాల్గొన్నారు.