దేవరుప్పుల, మార్చి 13 : రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం మూలం గా పంటలకు సాగునీరందక ఎండిపోయి రైతులు ఆర్థికంగా నష్టపోయిన తరుణంలో ఎమ్మెల్యే యశస్వినీరెడ్డి క్షమాపణ చెబితే సరిపోదని టీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. ఎకరాకు రూ.20వేల చొప్పు న నష్ట పరిహారం ఇప్పించి రైతులను ఆదుకోవాలని డి మాండ్ చేశారు. మండలకేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ మండల అధ్యక్షుడు తీగల దయాకర్ నేతృత్వంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. నెల రోజుల ముందే రిజర్వాయర్ల నుంచి సాగునీరు విడుదల చేస్తే పంటలు ఎండిపోయేవి కావన్నారు.
ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు నీరు లేక రైతులకు నష్టం వాటిల్లిందన్నా రు. ప్రజా నాయకుడు, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఎండిన పంటలను పరిశీలించి, రైతులను పరామర్శిస్తుంటే కొందరు కాంగ్రెస్ నాయకులు ఆరోపణలు చేయడాన్ని వారు నిరసించారు. ఎర్రబెల్లి నీటిపారుదల శాఖ అధికారులతో మాట్లాడిన తర్వాతే పంటలకు నీరు విడుదల చేశారని తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి చింత రవి, నాయకులు బస్వ మల్లేశ్, ధరావత్ రాంసింగ్, జోగు సోమనర్సయ్య, శీల తిరుమల్లేశ్, అంబాల యాకన్న, గాదరి శ్రీకాంత్, కారుపోతుల అంజయ్య, నగేశ్ పాల్గొన్నారు.