కమలాపూర్, ఏప్రిల్ 3: అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తానని బీఆర్ఎస్ కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. బుధవారం కమలాపూర్ మండలంలోని ఉప్పల్ గ్రామంలో హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. 2014-19వరకు ఎంపీ గా ఉన్న సమయంలో రూ.వెయ్యి కోట్లతో కరీంనగర్ స్మార్ట్ సిటీ తీసుకుకొచ్చినట్లు తెలిపారు. హైదరాబాద్తో పోటీపడేలా కరీంనగర్లో ఐటీ టవర్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మనోహరాబాద్ నుంచి కొత్తపల్లి రైల్వే లైన్ మంజూరు, హైదరాబాద్ నుంచి రామగుండం వరకు, కరీంనగర్ చుట్టూ పక్కల జాతీయ రహదారుల కోసం పార్లమెంట్లో గళమెత్తి మంజూరు చేయించినట్లు తెలిపారు. ట్రిపుల్ ఐటీ కోసం 50 ఎకరాల స్థలం కేటాయిస్తే 2019లో గెలిచిన బండి సంజయ్ పట్టించుకోకపోవడంతో బీజేపీ దాన్ని ఇతర రాష్ర్టాలకు తరలించిందన్నారు. ఐదేళ్లు బీజేపీ ఎంపీగా ఉన్న బండి సంజయ్ కరీంనగర్ అభివృద్ధ్ది కోసం ఐదు రూపాయ లు కూడా తీసుకురాలేదని విమర్శించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నా ఉప్పల్ ఆర్వోబీ పనులు బండి సంజయ్ పూర్తి చేయించలేదన్నారు. కరీంనగర్ ఎమ్మెల్యేగా ఓడిపోయిన సంజయ్ మళ్లీ ఎంపీగా పోటీ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఎమ్మెల్యే, ఎంపీగా పోటీ చేస్తున్న బండికి కరీంనగర్ ఏమైనా పునరావాస కేంద్రమా అని ప్రశ్నించారు. మా ర్పు పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సాగునీరు ఇవ్వకపోవడంతో పంటలు ఎండిపోయి తెలంగాణ పదేళ్లు వెనక్కి పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేసే సత్తా తనకే ఉందని, ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని కోరారు.
హుజూరాబాద్ నియోజకవర్గంలో పంటలు చివరి దశకు వచ్చాయని, సాగునీళ్లు ఇస్తరా? లేక గేట్లు ఎత్తాల్నా? తేల్చుకోవాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మర్రిపెల్లిగూడెం గ్రామంలో మక్కజొన్న పంటను ఆయన పరిశీలించారు. చివరి తడి ఇవ్వకపోతే పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందన్నారు. నీళ్లు ఇవ్వకుండా ఎంపీ ఎన్నికల కోసం గ్రామాలకు వస్తే కాంగ్రెస్ వాళ్ల ను ప్రజలు ఉరికిస్తారన్నారు. రెండు రోజుల్లో గేట్లు ఎత్తి సాగునీళ్లు ఇవ్వాలని లేదంటే ఈ నెల 6న బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టి తామే గేట్లు ఎత్తుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ పేరాల సంపత్రావు, వైస్చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, డైరెక్టర్ సత్యనారాయణరావు, మాజీ జడ్పీటీసీ నవీన్కుమార్, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, మాజీ సర్పంచ్ దేవేందర్రా వు, మాజీ ఎంపీటీసీ సంపత్రావు, మాజీ ఎంపీపీ లక్ష్మణ్రావు, నాయకులు నాయినేని తిరుపతిరావు, శ్రీధర్రావు, రాంచందర్, చోటేమియా, జక్కుల రాజు, ముజీబ్హుస్సేన్, సా రంగం, విజయ్, రమేశ్, క్రాంతి, ఉపేందర్ పాల్గొన్నారు.