ఊరూరా ప్రచారంలో కారు దూసుకుపోతోంది. జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ పక్కా వ్యూహంతో ముందుకెళ్తున్నది. పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఎక్కడికక్కడ జనంతో మమేకమవుతున్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలతో పాటు మ్యానిఫెస్టోలోని అంశాలను వివరిస్తూ తమను గెలిపించాలని కోరుతున్నారు. పాలకుర్తి, స్టేషన్ఘన్పూర్, జనగామ నియోజకవర్గాల్లో ప్రభుత్వ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల కార్యకర్తలు గులాబీ గూటికి చేరడంతో పార్టీకి మరింత బలం పెరి గింది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అసంతృప్తులతో ఆగమవుతుండగా బీఆర్ఎస్లో మాత్రం ఉరిమే ఉత్సా హం నెలకొంది. బీఆర్ఎస్ జనగామ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి ఆదివారం బచ్చన్నపేట మండలంలో ప్రచారం చేయగా, ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టారు.
జనగామ, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ) : జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా బీఆర్ఎస్ పకడ్బందీ ప్రణాళికతో ముందుకెళ్తోంది. ఇప్పటికే తొమ్మిదేండ్ల అభివృ ద్ధి, సంక్షేమ పథకాలు, రానున్న ఐదేండ్లలో అమలు చేసేలా బీఆర్ఎస్ మ్యానిఫెస్టో అంశాలపై అభ్యర్థులు ఇంటింటికీ తిరిగి వివరిస్తున్నారు. ఆత్మీయ సమ్మేళనాలు, మండల, నియోజకవర్గాల వారీగా ముఖ్య కార్యకర్తల సమావేశాలతో విస్తృత ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభి వృద్ధి, సంక్షేమాన్ని చూపుతూ ఎన్నిక క్షేత్రంలో సై అంటే సై అంటూ సవాల్ విసురుతున్నారు. పెద్ద ఎత్తున వివిధ పార్టీల నుంచి చేరికలతో కారు ప్రచార జోరు సాగిస్తోంది. తమను ఆశీర్వదిస్తే రాబోయే ఐదేళ్లలో నియోజకవర్గాలను మరింత అద్భుతంగా తీర్చిదిద్దుతామంటూ మద్దతు కూడగడుతున్నారు. పాలకుర్తిలో ఎర్రబెల్లి దయాకర్రావు విజయం వైపు దూసుకుపోతుంటే, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ టీ రాజయ్య సంపూర్ణ మద్దతు ప్రకటించిడంతో స్టేషన్ఘన్పూర్లో కడియం శ్రీహరి గెలుపు ఖాయమైంది. ఇక జనగామలో సీఎం సభ తర్వాత పల్లా గెలుపు ‘నల్లేరుపై నడకే’ అన్నట్లు మారితే పొన్నాల చేరిక బీఆర్ఎస్కు అదనపు బలాన్ని ఇచ్చి రెట్టింపు మెజార్టీ కోసం పోటీ జరుగుతున్నది. కేసీఆర్ పాల్గొన్న జనగామ ప్రజా ఆశీర్వాద సభ తర్వాత ఓటర్లకు దగ్గరైన గులాబీ సేన మరింత స్పీడ్తో జనంలోకి వెళ్తున్నది. జనగామ బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా ఇప్పటి వరకు తరిగొప్పుల, జనగామ రూరల్, అర్బన్, చేర్యాల, కొమురవెల్లి, బచ్చన్నపేట మండలాల్లోని పలు గ్రామాల్లో ఇంటింటి ప్రచారం చేశారు. గ్రామస్తుల సమస్యలు వింటూ, వినతులు స్వీకరిస్తూ, వృద్ధులు, మహిళలకు సంక్షేమ పథకాలను వివరిస్తూ పల్లా ప్రచారం సాగుతున్నది. పాలకుర్తి అభ్యర్ధి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు వివిధ మండలాల ముఖ్యనేతలు, ప్రజాప్రతినిధులతో ఆత్మీయ సమావేశాలు నిర్వహిసున్నారు. స్టేషన్ఘన్పూర్ అభ్యర్ధి కడియం శ్రీహరి ధర్మసాగర్, వేలేరు మండలాల్లో పలు గ్రామాల్లో ఇంటింటి ప్రచారంతో ప్రజలతో మమేకమయ్యారు. ఇక జనగామ బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ సమక్షంలో గులాబీపార్టీలో చేరిన టీ-పీసీసీ తొలి అధ్యక్షుడు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య జనగామలో మకాం వేసి ఎన్నికల ప్రచారంలో భాగంగా తన వర్గీయులతో ఆత్మీయ సమావేశాలు నిర్వహించి బీఆర్ఎస్లోకి భారీ చేరికలకు వ్యూహం రూపొందిస్తున్నారు.
బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో ప్రకటించిన విధంగా రైతుబంధు ఎకరానికి రూ.16వేలకు వచ్చే ఐదేండ్లలో క్రమంగా పెంపు, సౌభాగ్యలక్ష్మి పేరుతో బీపీఎల్ కుటుంబాలకు చెందిన అర్హులైన మహిళలకు కొత్తగా నెలకు రూ.3వేల గౌరవ భృతిపై అన్ని వర్గాల్లో విశ్వాసం పెరుగుతున్నది. అర్హులైన పేద కుటుంబాలకు రూ.400కే వంట గ్యాస్ సిలిండర్, కేసీఆర్ ఆరోగ్యరక్ష ద్వారా రూ.15లక్షలు, ప్రభుత్వ ఉద్యోగుల మాదిరి గానే జర్నలిస్టులకు రూ.15లక్షల వరకు నగదు రహిత వైద్యబీమా, పేద కుటుంబాలకు రూ.5లక్షల
సన్నబియ్యం, ఆసరా పింఛన్లను రూ.5016కు పెంపును మార్చి నుంచి దశలవారీగా అమలు చేస్తామన్న బీఆర్ఎస్ మ్యానిఫెస్టోకు లబ్ధిదారులు జేజేలు పలుకుతున్నారు.
ఎక్కడ చూసినా ప్రచార కార్యక్రమాలతో గులాబీ శ్రేణుల అభ్యర్థులు గ్రామాలను చుట్టేస్తుంటే విపక్ష పార్టీల్లో ఆ సందడి కనిపించడంలేదు. కాంగ్రెస్ పార్టీలో వర్గపోరుతో కుమ్ములాటలు సాగుతుంటే బీజేపీ లో అభ్యర్థులపై అసంతృప్తి వ్యక్తమవుతున్నది. జనగామ అభ్యర్ధి ఆరుట్ల దశమంత్రెడ్డిని మార్చాలంటూ ఆ పార్టీ ఆశావహుడైన బేజాడి బీరప్ప వర్గం రహస్య సమావేశమై అధిష్ఠానానికి తమ అసమ్మతి గళాన్ని వినిపించింది. ఇక స్టేషన్ఘన్పూర్, పాలకుర్తి అభ్యర్థులు విజయరామారావు, లేగ రామ్మోహన్రెడ్డి అభ్యర్థిత్వాలపై సొంత పార్టీలోనే అసంతప్తులు, వేరు కుంపట్లు పెట్టారు. పాలకుర్తి కాంగ్రెస్ టికెట్ ఆశించి పౌరసత్వం నిరాకరణతో హనుమాండ్ల ఝాన్సీ లక్ష్మీరెడ్డి భంగపాటుకు గురై ఆమె కోడలిని ఎన్నికల బరిలోకి దింపడంతో క్యాడర్లో తీవ్ర నైరాశ్యం నెలకొని ఎవరిదారి వారే అన్నట్లు ఆసక్తికర రాజకీయం సాగుతున్నది. గెలుపు గుర్రాలను పక్కకు నెట్టి డిపాజిట్లు కూడా దక్కే స్థాయిలేని వారికి టికెట్లు ఇచ్చి బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్యే సీట్లు బంగారు పల్లెంలో పెట్టి ఇస్తున్నారని సొంత పార్టీ వారే బహిరంగంగా విమర్శిస్తున్నారు.