కాజీపేట, నవంబర్ 23 : ప్రత్యేక తెలంగాణ ఏర్పాటైన తర్వాత వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని చూసి ప్రజలు కారు గుర్తుకు ఓట్లు వేయాలని చీఫ్ విప్, పశ్చిమ బీఆర్ఎస్ అభ్యర్థి దాస్యం వినయ్భాస్కర్ కోరారు. కాజీపేట పట్టణంలోని 62వ డివిజన్ వైఎస్సార్ నగర్లో డివిజన్ అధ్యక్షుడు పాలడుగుల శివకుమార్, 61వ డివిజన్ అధ్యక్షుడు కుమ్మరి కోటిలింగం ఆధ్వర్యంలో నాన్యతండాలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. పలు ప్రాంతాల్లో వివిధ పార్టీలకు చెందిన పలువురు పార్టీలో చేరగా, కండవాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమలో కారు గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తే, అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండి ఐదేళ్లు ప్రజా సేవకుడిగా పని చేస్తానన్నారు. ఎన్నికలు రాగానే వివిధ పార్టీల రాజకీయ నాయకులు డివిజన్లలో తిరుగుతున్నారని,
తెలంగాణ ఉద్యమం, కరోనా కష్టకాలం, నగరంలో వరదలు వచ్చినప్పుడు వారికి ప్రజల బాధలు కనిపించలేదా? అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధికి ఆకర్షితులైన పలువురు బీఆర్ఎస్లో చేరడం అభినందనీయమన్నారు. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు. పట్టణంలోని వైఎస్సార్ గుడిసె వాసులకు ఎల్లవేళా అండగా ఉంటానన్నారు. సీఎం కేసీఆర్ ముచ్చటగా మూడోసారి సీఎం పదవిని చేపట్టడం ఖాయమన్నారు. నగరంలో అర్హూలైన పేదలందరికీ ఇండ్లు నిర్మించేందుకు కృషి చేస్తానని చెప్పారు. కార్యక్రమంలో మేయర్ గుండు సుధారాణి, పశ్చిమ ఎన్నికల కన్వీనర్ జనార్దన్ గౌడ్, ఇన్చార్జి, మాజీ కార్పొరేటర్ మిడిదొడ్డి స్వప్న, 61వ డివిజన్ కార్పొరేటర్ ఎలకంటి రాములు, నాయకులు తేలు సారంగపాణి, కాటాపురం రాజు, సంపత్ రావు, బైరి రవి, ఫర్హాన్, గోల్కొండ రాంబాబు, యుగేంధర్ పాల్గొన్నారు.
హనుమకొండ : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రూపొందించిన కేసీఆర్ భరోసా గురించి చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ప్రజలకు వివరించారు. బాలసముద్రంలోని ఏకశిల పార్కు(ప్రొఫెసర్ జయశంకర్ స్మృతి వనం)లో వాక్ అండ్ టాక్ విత్ ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా వాకర్స్ను కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కారు గుర్తుకు ఓటేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. నియోజకవర్గంలో పారుల అభివృద్ధిలో వాకర్స్ది కీలక పాత్ర ఉండాలని సూచించారు. నియోజకవర్గంలో అడుగడుగునా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రతి గడపకూ సంక్షేమ పథకాలు అందించామని తెలిపారు. మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటైతే మరింత అభివృద్ధి జరుగుతుందని, 30న జరుగనున్న ఎన్నికల్లో అందరూ సహకరించాలని కోరారు.