హనుమకొండ, ఆగస్టు 4 : ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలులో వంద శాతం ప్రగతి సాధించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో గ్రామ పంచాయతీ భవనాలు, తెలంగాణ హరితహారం, జీవో 58, 59 అమలు, గొర్రెల అభివృద్ధి పథకం, బీసీ బంధు తదితర అంశాలపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను వేగవంతం చేయాలన్నారు. జిల్లాలో హరితహారం కార్యక్రమం కింద వివిధ శాఖలకు నిర్దేశించిన లక్ష్యాలు చేరుకొనేందుకు కృషి చేయాలన్నారు. అందుకుగాను పనుల్లో వేగం పెంచాలన్నారు. గుంతలు తీసే పని పూర్తి చేసి, త్వరగా ప్లాంటేషన్ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
ఈజీఎస్, నాన్ ఈజీఎస్ పనుల కింద కేటాయించిన లక్ష్యాన్ని పూర్తి చేయాలన్నారు. ముఖ్యంగా ప్లాంటేషన్, జియో ట్యాగింగ్, క్షేత్ర స్థాయి పరిశీలన ముఖ్యమన్నారు. జిల్లా అధికారుల నుంచి గ్రామ పంచాయతీ స్థాయి వరకు వివిధ దశల్లో పనులు సమన్వయం చేసుకుని మొకలు నాటే లక్ష్యాన్ని పూర్తి చేయాలన్నారు. నాటిన మొకలకు రక్షణ ముఖ్యమన్నారు. గృహ అవసరాలకు సంబంధించి పంపిణీ చేసిన మొకలు నాటిన వివరాలు, మొకల పరిస్థితిపై డోర్ టూ డోర్ తిరిగి పరిశీలించాలన్నారు. చనిపోయిన మొకల స్థానంలో కొత్త మొకలు అందించాలన్నారు. జిల్లా, మండల స్థాయి అధికారులు, మున్సిపల్ కమిషనర్లు క్షేత్రస్థాయిలో మొకల సంరక్షణ పనులను పరిశీలించాలని కలెక్టర్ ఆదేశించారు.
పంచాయతీరాజ్ శాఖ ద్వారా చేపట్టిన గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలన్నారు. జిల్లాలో బీపీఎల్ కుటుంబాలకు ఇంటి స్థలాల కోసం వచ్చిన దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ పూర్తి చేసి, అర్హుల జాబితా సమర్పించాలని తెలిపారు. జీవో 58 కింద మిగతా దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేసి, త్వరగా పరిషరించాలన్నారు. జీవో 59 కింద రెండో విడుత డిమాండ్ నోటీసులు జారీచేయాలని, జారీ చేసిన వాటికి చార్జీల వసూలు చర్యలు వేగవంతం చేయాలన్నారు. జిల్లాలో పెండింగ్ సీఎంఆర్కు సంబంధించి, మిల్లర్లు త్వరగా ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. గొర్రెల అభివృద్ధి పథకం కింద పంపిణీకి చర్యలు చేపట్టాలన్నారు. బీసీలకు రూ.లక్ష ఆర్థికసాయం కింద వచ్చిన దరఖాస్తుల స్రూటినీ అనంతరం అర్హుల జాబితా సమర్పించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సీహెచ్ మహేందర్జీ, డీఎఫ్వో జే వసంత, ఏ శ్రీనివాస్ కుమార్, డీపీవో వీ జగదీశ్వర్, మున్సిపల్ అదనపు కమిషనర్ రషీద్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.