హనుమకొండ, జూన్ 23 : స్మార్ట్ సిటీ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని బల్దియా కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. స్మార్ట్ సిటీ పథకంలో భాగంగా వరంగల్లో కొనసాగుతున్న ఫేజ్-1 అభివృద్ధి పనులను శుక్రవారం కమిషనర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఎంజీఎం జంక్షన్, గోపాలస్వామి గుడి ప్రాంతం, పోచమ్మ మైదాన్, వరంగల్ ఎస్బీఐ ఏరియా, వరంగల్ పోస్టాఫీస్ కూడలి, ఓ సిటీ ఏరియా, బాలాజీనగర్ జంక్షన్ ప్రాంతాల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ స్మార్ట్ సిటీ పనుల్లో భాగంగా ఫుట్పాత్లు, లైటింగ్, లేన్ మారింగ్ పనులతో పాటు మిగిలిన బీటీ పనులను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. కాంట్రాక్టర్లు పనులను పూర్తి చేసేందుకు చొరవ చూపకపోతే ఇంజినీరింగ్ విభాగం ద్వారా పూర్తి చేసే అవకాశాలను పరిశీలించాలన్నారు.
పోచమ్మమైదాన్ నుంచి వరంగల్ చౌరస్తా వరకు మిగిలి పోయిన పనులను 15 రోజుల్లోగా పూర్తి చేయాలన్నారు. వీటితో పాటు సర్వీస్ రోడ్ల పనులను వేగవంతం చేయాలన్నారు. వరంగల్ పోస్టాఫీసు కూడలి ప్రాంతంలో ఫుట్పాత్ పనులను పూర్తి చేసి, డ్రైనేజీ నిర్మించి, దానిపైన కప్పు ఏర్పాటు చేయాలని కమిషనర్ ఆదేశించారు. పనులు నెమ్మదిగా నడుస్తున్నాయని, నెల రోజుల్లో పురోగతి కనిపించాలని స్పష్టం చేశారు. బాలాజీనగర్లో జంక్షన్ డ్రైనేజీ పనులకు అనుమతులు మంజూరైనందున తొందరగా పనులు ప్రారంభించాలన్నారు. స్ట్రోమ్ వాటర్ డ్రైన్ నిర్మాణంలో భాగంగా పెండింగ్ పనులను తక్షణమే పూర్తి చేయాలన్నారు. వెంకట్రామ జంక్షన్ నుంచి ఓసిటీ వరకు విద్యుత్ స్తంభాల తరలింపు పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కమిషనర్ ఆదేశించారు. కార్యక్రమంలో సీఎంహెచ్వో డాక్టర్ రాజేశ్, ఎస్ఈ ప్రవీణ్చంద్ర, సిటీ ప్లానర్ వెంకన్న, బయాలజిస్ట్ మాధవరెడ్డి, ఈఈలు శ్రీనివాస్, సంజయ్ కుమార్, శానిటరీ సూపర్వైజర్ సాంబయ్యతో పాటు స్మార్ట్ సిటీ ప్రతినిధి ఆనంద్ ఓలేటి పాల్గొన్నారు.
నిబంధనలు పాటించాలి
నిబంధనల మేరకు భవన నిర్మాణాలు చేపట్టాలని కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా అన్నారు. పెద్ద భవనాలు, నిర్మాణాల అనుమతి కోసం దరఖాస్తులు స్వీకరించిన నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు కమిషనర్ హనుమకొండలోని పలు ప్రాంతా ల్లో క్షేత్ర స్థాయిలో పర్యటించారు. నగరంలోని ప్రగతి నగర్ ఫేజ్-1, ఎన్ఐటీ దర్గా రోడ్డు, చైతన్యపురి కాలనీ, కేఎల్ఎన్ రెడ్డికాలనీ, మోర్ సూపర్ మారెట్ ప్రాం తం, సర్యూట్ హౌస్ రోడ్డు, అశోక కాలనీ, అలంకార్ జంక్షన్, కాపువాడ ప్రాంతాల్లో క్షేత్ర స్థాయిలో పర్యటించి, దరఖాస్తులో నమోదు చేసిన సమాచా రం, వాస్తవ స్థితిగతులను పరిశీలించారు. లోపాలు సవరించి నిర్మాణాలు చేసేలా చూడాలని సిటీ ప్లానర్ను ఆదేశించారు. కమిషనర్ వెంట సిటీ ప్లానర్ వెంకన్న, ఏఈఈ కిరణ్ ప్రసాద్, శానిటరీ సూపర్వైజర్ నరేందర్, శానిటరీ ఇన్స్పెక్టర్లు కరుణాకర్, గోలొండ శ్రీను ఉన్నారు.
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల తనిఖీ
ఎనుమాముల మారెట్లోని స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచిన తొలి దశ ఈవీఎం(ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్)లను వరంగల్ తూర్పు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, బల్దియా కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్ట్రాంగ్ రూములలో కావాల్సిన సౌకర్యాలు ఉండేలా చూడాలని బల్దియా ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో వరంగల్ అదనపు కలెక్టర్ శ్రీవత్స, ఎస్ఈ ప్రవీణ్ చంద్ర, సీఎంహెచ్వో డాక్టర్ రాజేశ్, ఈఈలు శ్రీనివాస్, సంజయ్ కుమార్ పాల్గొన్నారు.