గీసుగొండ, జనవరి 7: గీసుగొండ మండలంలోని గంగదేవిపల్లి గ్రామంలో శనివారం సాయంత్రం సినీఫక్కీలో దోపిడీ జరిగింది. పోలీస్నని నమ్మించి వృద్ధురాలిపై దాడి చేసి గుర్తు తెలియని వ్యక్తి బంగారు గొలుసును అపహరించుకుపోకుపోయాడు. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మేడిద రాజుకుమార్ గంగదేవిపల్లి శివారులోని నర్సంపేట ప్రధాన రహదారికి పక్కన ఇళ్లు నిర్మించుకొని తల్లి దండ్రులు మేడిద నర్సమ్మ, మల్లయ్య, భార్య పిల్లలతో కలిసి ఉంటున్నాడు. రోజూవలే కుటుంబ సభ్యులు వ్యవసాయ పనులకు వెళ్లగా, తల్లి నర్సమ్మ ఇంటి వద్ద ఉన్నది. సాయంత్రం బైక్పై గుర్తు తెలియని వ్యక్తం వచ్చి దాహమవుతున్నది.. తాగునీరు ఇవ్వాలని కోరాడు. తాగునీరు తీసుకొచ్చిన ఆ వృద్ధురాలు నీవు ఎవరువని అడుగగా, పోలీస్నని, విచారణకోసం వచ్చానని చెప్పాడు.
నీళ్లు ఇచ్చి నర్సమ్మ ఇంట్లోకి వెళ్లే క్రమంలో పక్కనే ఉన్న కర్రతో ఆ వ్యక్తి వృద్ధురాలి తలపై కొట్టాడు. దీంతో నర్సమ్మ స్ప్రహతప్పి కింద పడిపోగా, మెడలోనుంచి బంగారు పెస్తెలతాడు లాక్కొని పరారయ్యాడు. కొద్దిసేపటి తర్వాత ఇంటికి వచ్చిన భర్త మల్లయ్య చూసి కేకలు వేయడంతో స్థానికులు వచ్చి 108 వాహనంలో ఎంజీఎం దవాఖానకు తరలించినట్లు తెలిపారు. కాగా, విషయం తెలుసుకున్న ఈస్టు జోన్ డీసీపీ వెంటకలక్ష్మి, క్రైమ్ అడిషనల్ డీసీపీ పుష్ప, సీసీఎస్ పోలీసులు, డాగ్ స్క్యాడ్ బృందం ఘటన స్థలానికి చేరుకొని బాధితుల నుంచి వివరాలు సేకరించారు. ఈ కేసును ఛేదించడానికి వరంగల్ సీపీ ఏవీ రంగనాథ్ 4 పోలీసు బృందాలను ఏర్పాటు చేశారని, నిందితుడి కోసం గాలిస్తున్నట్లు డీసీపీ తెలిపారు. మామునూర్ ఏసీపీ నరేశ్కుమార్, సీసీఎస్ సీఐ శ్రీనివాస్, గీసుగొండ ఇన్చార్జి సీఐ చేరాలు, ఎస్సై శ్వేత పాల్గొన్నారు.