స్టేషన్ఘన్పూర్, నవంబర్ 27 : నెల రోజులుగా సాగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారాలు మంగళవారంతో ముగిశాయి. నియోజకవర్గంలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రచారాలు పండుగలా సాగాయి. ప్రచారంలో పాల్గొన్న బీఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరికి, ఆయన కూతుళ్లు డాక్టర్ కడియం కావ్య, దివ్య, రమ్యకు గ్రామాల్లో ప్రజలు, బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు, మాజీ ప్రజాప్రతినిధులు అ పూర్వ ఘన స్వాగతం పలికి, బీఆర్ఎస్ను భారీ మెజార్టీతో గెలిపిస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ మోసపూరిత వాగ్దానాలను, తొమ్మిదేళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ సాధించిన ప్రగతిని, అన్ని వర్గాల ప్రజల కోసం బీఆర్ఎస్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను, బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను గ్రామాల్లో ప్రతి రోజూ బీఆర్ఎస్ శ్రేణులు ఇంటింటా ప్రచా రం చేసి, ప్రజలను చైతన్య పరిచారు. గ్రామాల్లో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రచారాలను చూసిన ప్రత్యర్థులు హడలిపోయి, తమకు ఓటమి తప్పదనే నిర్ణయానికి వచ్చారు. ఓటు బ్యాంకు ఉందని చెప్పుకుంటున్న కాంగ్రెస్ తమ మ్యానిఫెస్టో ప్రజలను ఆకర్షించలేకపోయింది. బీఆర్ఎస్ ప్రచారంతో ఓటు బ్యాంకుగా చెప్పుకుంటున్న కాంగ్రెస్ ఓట్లు సైతం బీఆర్ఎస్ పార్టీకి పడనున్నాయి.
ఎన్నికల ప్రచారం చివరి రోజున బీఆర్ఎస్ అభ్యర్థ్ది, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మండలంలోని శివునిపల్లిలో బొడ్రాయి వద్ద కొబ్బరికాయ కొట్టి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. శివునిపల్లి బొడ్రాయి నుంచి రైల్వే గేటు వరకు బీఆర్ఎస్ అభిమానులతో రోడ్షో నిర్వహించారు. అనంతరం చాగల్లు గ్రామంలో తన కూతుళ్లతో కలిసి రోడ్ షో ద్వారా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సాయంత్రం స్టేషన్ ఘన్పూర్ డివిజన్ కేంద్రంలో శివాజీ సర్కిల్ వద్ద నుంచి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ అభిమానులతో ర్యాలీగా బస్టాండ్ వరకు ర్యాలీగా ప్రచారం చేశారు. నమిలిగొండ గ్రామంలో కడియం శ్రీహరి కూతుళ్లు ఇంటింటా ప్రచారం నిర్వహించి, నిజాయితీగా పనిచేస్తూ, ప్రజల సంక్షేమం కోసం కృషి చేసే కడియం శ్రీహరిని గెలిపించాలంటూ ప్రచారం చేశారు. శివునిపల్లి, చాగల్లు, స్టేషన్ ఘన్పూర్ గ్రామాల్లో జరిగిన ప్రచారాల్లో కడియం శ్రీహరి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆశీర్వదించి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారని, ఈ నియోజకవర్గప్రజలు ఆశీర్వదించి, భారీ మెజార్ట్టీతో గెలిపిస్తే ఈ నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. తనను గెలిపిస్తే స్టేషన్ఘన్పూర్ మండల మొత్తానికి వచ్చే నిధులతో సమానంగా ఈ నియోజకవర్గ కేంద్రానికి నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేస్తానన్నారు. రెవెన్యూ డివిజన్గా మారిన స్టేషన్ ఘన్పూర్కు పూర్తి స్థాయి లో ప్రభుత్వ కార్యాలయాలు తీసుకువస్తానని, శిథిలావస్థకు చేరిన ప్రభుత్వ కార్యాలకు నూతన భవనాలు ఏర్పాటు చేస్తానని, సంవత్సరంలో వంద పడకల దవాఖాన నిర్మాణం చేపట్టి ఆధునిక వైద్యం ను అందుబాటులోకి తీసుకవస్తానన్నారు. స్టేషన్ఘన్పూర్ రిజర్వాయర్ కట్ట ను సుందరీకరణ చేసి పర్యటక కేంద్రంగా మా ర్చడమే కాకుండా రిజర్వాయర్లో బోటింగ్ ఏ ర్పా టు చేస్తానన్నారు. స్టేషన్ఘన్పూర్, శివునిపల్లి, చా గళ్లును కలిపి మున్సిపాలిటీగా మార్చి ఎమ్మెల్యే రా జయ్య, పల్లా రాజేశ్వర్ రెడ్డి సహకారంతో వందల కోట్లు నిధులు తీసుకవచ్చి అభివృద్ధి చెందిన నియోకవర్గాల సరసన నిలబెడతానన్నారు. గృహలక్ష్మి ద్వారా అర్హులైన వారికి ఇండ్లు అం దించేందుకు 500 ఇండ్లు మంజూరు చేయిస్తాన్నారు.
నేను ఎంటో, నా నిజాయితీ ఏంటో, నా పనితనం ఏంటో, నా వ్యక్తిత్వం ఏంటో మీ అందరికి ముప్పై ఏండ్లుగా తెలుసు.. మీరు పెట్టిన రాజకీయ భిక్షతో ఇప్పటి వరకు రాజకీయంలో ఉంటూ మీకు అందుబాటులో ఉంటూ సేవ చేస్తున్నా.. ఇకపై కూడా మీసేవలోనే ఉంటా.. రేపు జరగబోయే ఎన్నికల్లో ఓటు వేసే ముందు ఒక్కసారి ఆలోచించి ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మాచర్ల గణేశ్, బీఆర్ఎస్ జిల్లా నాయకులు నరేందర్ రెడ్డి, బెలిదె వెంకన్న, నీల గట్టయ్య, రాజేశ్నాయక్, బూర్ల శంకర్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చేపూరి వినోద్, సర్పంచ్లు తాటికొండ సురేశ్ కుమార్, పోగుల సారంగపాణి, డ్యాగల ఉప్పలస్వామి, ఉప సర్పంచ్లు రాంచందర్, నీల ఐలయ్య, ఎంపీటీసీలు బీ లతాశంకర్, రజాక్ యాదవ్, కనకం స్వరూప గణేశ్, గన్ను నర్సింహులు, గుర్రం రాజు, కుడా మాజీ డైరెక్టర్ ఆకుల కుమార్, పార్శి కృష్ణారావు, పీఏసీఎస్ డైరెక్టర్ తోట సత్యం, కుంబం కుమార్, తెల్లాకుల రామకృష్ణ, పార్శి రంగారావు, మోటం ప్రభాకర్, వారణాసి రామకృష్ణ, పోశాల కృష్ణ, అశోక్, రాజు, సంపత్రాజ్, శంకర్, ఏసుబాబు, శ్రీను, మండల వైస్ ఎంపీపీ సుధీర్రెడ్డి, మాజీ ఎంపీటీసీలు ఫాతికుమార్, ఉపేందర్, గ్రామ అధ్యక్షులు, ప్రజా ప్రతినిధులు, కడియం యువసేన సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.